అధికార వైసీపీలో ఆధిపత్య పోరుకు అంతం లేనట్లు ఉంది. ఆ పార్టీలో అంతర్గతంగా రచ్చ జరుగుతూనే ఉంది. రోజుకో నియోజకవర్గం..పూటకో గొడవ అన్నట్లు ఉంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సెట్ అవ్వడం లేదు. కొందరు ఎమ్మెల్యేల తీరు..పార్టీ నేతలకు నచ్చడం లేదు. గత ఎన్నికల్లో వారి గెలుపు కోసం కష్టపడితే అధికారంలోకి వచ్చాక తమని పట్టించుకోవడం లేదని, అలాగే తమనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు.
అందుకే అలాంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల మధ్య రచ్చ నడుస్తుంది. వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత స్థానం.అక్కడ మూడు సార్లు గెలిచారు. అయితే గత ఎన్నికల్లో వేణు కోసం సీటు వదిలేసి..మండపేట వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. ఇటు వేణు గెలిచారు.
ఓడిన సరే బోసుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారు..కానీ తర్వాత మండలి రద్దు అనే నెపంతో పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ దక్కింది. అయితే గత ఎన్నికల్లో వేణు గెలుపు కోసం బోస్ వర్గం పనిచేసింది. కానీ మంత్రి అయ్యాక వేణు..బోసు వర్గాన్ని పట్టించుకోవడం లేదు. అలాగే అన్యాయంగా వారిపై కేసులు కూడా పెట్టించారట తన వర్గంతో పాటు, తోట త్రిమూర్తులుయ్ వర్గాన్ని వేణు వేధిస్తున్నారని బోస్ అంటున్నారు. జగన్ తో వేణు గురించి మాట్లాడనని, వేణుతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని, మళ్ళీ వేణుకు సీటు ఇస్తే.. తాను గాని, తన తనయుడు గాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని అంటున్నారు.
జగన్ తనకు అన్నీ విధాలా న్యాయం చేశారని, కానీ ఈ విషయంలో కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని చెప్పుకొచ్చారు. మొత్తానికి బోస్-వేణు మధ్య రచ్చ రామచంద్రాపురంలో వైసీపీని ముంచేలా ఉంది.