తెలుగుదేశం పార్టీకి గిరిజన ప్రాంతాల్లో పెద్దగా పట్టు లేదనే సంగతి తెలిసిందే. మొదట నుంచి ఏజెన్సీ నియోజకవర్గాల్లో టిడిపి రాణించదు. గతంలో కాంగ్రెస్ , ఇప్పుడు వైసీపీ హవా నడుస్తుంది. కానీ ఇప్పుడు టిడిపికి ఉన్న ఇబ్బంది ఏంటంటే..వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతని సైతం ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో ఉంది. అలా టిడిపి బలపడని స్థానాల్లో రంపచోడవరం కూడా ఒకటి. ఎస్టీ రిజర్వడ్ స్థానంగా 2008లో ఈ స్థానం ఏర్పడింది.
ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, టిడిపి ఓడింది. ప్రజారాజ్యం ఓట్ల చీలిక టిడిపికి మైనస్. 2014లో రాష్ట్రంలో టిడిపి వేవ్ ఉంది..అయినా సరే రంపచోడవరంలో వైసీపీ గెలిచింది. 8 వేల ఓట్ల తేడాతో టిడిపి ఓడింది. తర్వాత వైసీపీ నుంచి గెలిచిన వంతల రాజేశ్వరిని టిడిపిలోకి తీసుకున్నారు. అధికారంలో ఉంటూ పనులు చేయించారు. అయినా సరే ఉపయోగం లేదు. 2019 ఎన్నికల్లో పార్టీ జంపింగ్, వైసీపీ వేవ్..టిడిపిని దారుణంగా ఓడించింది.
వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేసి..టిడిపిపై దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇంత మెజారిటీకి కారణం టిడిపిపై యాంటీ, వైసీపీ వేవ్ మాత్రమే. ఇక ఎమ్మెల్యేగా ఇప్పుడు ధనలక్ష్మీకు అసలు పాజిటివ్ లేదు. అభివృద్ధి చేయడం లేదు. రోడ్లు, తాగునీరు, విద్యా, వైద్య సౌకర్యాలు పెద్దగా లేవు. ఏదైనా ఆసుపత్రికి వెళ్లాలంటే మైళ్ళ దూరం డోలిలోనే తీసుకెళ్లాలి.
ఇలా ఎటు చూసుకున్న ఎమ్మెల్యేకి మైనస్సే ఉంది. కానీ టిడిపికి ప్లస్ లేదు. టిడిపి అనుకున్న విధంగా బలపడలేదు. పైగా అక్కడ ఎమ్మెల్యే కంటే జగన్ ఇమేజ్ ఎక్కువ కనిపిస్తుంది. దీని వల్ల టిడిపికి ఛాన్స్ దొరకడం లేదు. ఇదే పరిస్తితి కొనసాగితే రంపచోడవరంలో టిడిపి మళ్ళీ ఓడిపోయేలా ఉంది.