రాజకీయాలు ఎప్పుడు ఒకేలా వుండవు..వ్యూహాలు ఎప్పుడు ఒకేలా పనిచేయవు. గత ఎన్నికల్లో జగన్ వ్యూహాలు సక్సెస్ అయ్యి వైసీపీ విజయం సాధించింది. కానీ ఈ సారి కూడా అలాగే జగన్ వ్యూహాలు సక్సెస్ అవుతాయని అనుకోవడానికి లేదు. ఇప్పటికే చాలా చోట్ల జగన్ వ్యూహాలు విఫలమవుతున్నాయి. ఈ క్రమంలోనే వినుకొండలో కూడా జగన్ పాచికలు పారడం కష్టం.
కమ్మ వర్గం ప్రభావం వినుకొండలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కూడా కమ్మ నేతని నిలబెట్టి గెలిచారు. టిడిపి నుంచి జీవీ ఆంజనేయులు, వైసీపీ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేశారు. ఇద్దరు కమ్మ నేతలే. అయితే కమ్మ ఓట్లు టిడిపికే పడతాయని అనుకుంటారు. కానీ అలా జరగలేదు. ఓట్లు చీలిపోయాయి. వినుకొండలో వైసీపీ గెలిచింది. ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లా అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. పలు అక్రమాలలో ఆయన పేరు బయటకొచ్చింది. ఇక సొంత పార్టీ వాల్ల్ని సైతం ఆయన ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఇలా బొల్లా అనూహ్యంగా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. అటు టిడిపి నేత జీవీ ప్రజల్లోనే ఉంటూ వారి మద్ధతు పెంచుకున్నారు. దీంతో వినుకొండలో సీన్ మారిపోయింది. టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. ఈ సారి అక్కడ టిడిపి వన్ సైడ్ గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే వైసీపీ ఎమ్మెల్యే బొల్లా పై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉండటంతో ఆయన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని, ఈ సారి వినుకొండలో కొత్త అభ్యర్ధిని పెడతారని టాక్ నడుస్తుంది. అలా చేసిన వైసీపీకే నష్టం జరుగుతుంది. అప్పుడు బొల్లా వర్గం సపోర్ట్ ఉండదు. మొత్తానికి ఎటు చూసుకున్న ఎసరి వినుకొండలో వైసీపీకి దెబ్బపడేలా ఉంది.