ఏపీలో జగన్ ప్రభంజనం..మళ్ళీ జగనే సీఎం..దరిదాపుల్లో కూడా లేని టీడీపీ..ఇవే ఈ మధ్య వస్తున్న కొత్త సర్వేలు. ఇంకా వైసీపీకి తిరుగులేదని మరొకసారి అధికారం చేపట్టబోతుందని చెబుతున్నాయి. పైగా ఆ సర్వేలు ఎక్కడివో కాదు..జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేలు. అబ్బో జాతీయ మీడియా అంటే అంతా నిజమే అని అనుకోవడానికి లేదు. జాతీయ మీడియా కూడా పార్టీల వారీగా ఉంది. ప్రధానంగా బిజేపికి మద్ధతు ఇచ్చే మీడియా సంస్థలు ఎక్కువే. అలాగే వైసీపీ పెయిడ్ మీడియా సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల టైమ్స్ నౌ సంస్థ..రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, టిడిపి 0-1 సీటు గెలుచుకుంటుందని చెప్పింది. మరి ఇందులో నిజమెంత అంటే..రాష్ట్రంలో ఉన్నదే 25 ఎంపీ సీట్లు..అన్నీ వైసీపీ గెలుస్తుందట. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా, రకరకాల హామీలు ఇచ్చి..25కి 25 ఎంపీ సీట్లు గెలిపించాలని ప్రజలని జగన్ కోరారు. ప్రజలు కూడా జగన్ మాటలు నమ్మి 22 సీట్లలో గెలిపించారు.
మరి 22 సీట్లు ఇస్తే వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి సాధించింది శూన్యం..పార్లమెంట్ లో కూడా పెద్దగా విభజన హామీలపై మాట్లాడారు. ఎంపీలుగా రాష్ట్రానికి చేసేదేమీ లేదు. దీంతో వైసీపీపై యాంటీ ఎక్కువ ఉంది. పట్టుమని 10 సీట్లు గెలిచిన గొప్పే అనే పరిస్తితి. ఇక ఎంపీ సీట్లు అలా ఉంటే..మళ్ళీ తాజాగా మరొక సర్వే విడుదల చేశారు. పోల్ స్ట్రాటజీ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో రానున్న ఎన్నికల్లో వైసీపీకి 49 శాతం, టిడిపి-జనసేనకు కలిపి 41శాతం, ఇతరులకు 10 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు.
మరి ఈ సర్వే నమ్మశక్యంగా ఉందా? అంటే పెద్ద కామెడీగా ఉందని అంటున్నారు. ఒక్క వైసీపీ శ్రేణులు తప్ప..మిగిలిన వారు నమ్మడం లేదు. కాబట్టి ఇలాంటి సర్వేల వల్ల వైసీపీనే నవ్వులపాలు అయ్యేలా ఉంది.
ReplyReply allForward |