ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సర్వేల ఆధారంగా మంచి పనితీరు కనబరిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి టికెట్లు అని జగన్ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు బహిరంగంగానే చెప్పారు. ఈ ప్రకటన రాగానే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన వారంతా జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా టికెట్ ఆశించి జగన్ తో సమావేశమైన వారిలో నందిగామ జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య ఉన్నారు.
నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఉన్నారు. సౌజన్య జగన్ తో సమావేశం అవడం ఆసక్తికరంగా మారింది. సౌజన్య మాత్రం జడ్పిటిసి బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలపడానికి మర్యాదపూర్వకంగానే జగన్ కలిశానని చెబుతూనే, అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పటం అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ కృషి చేస్తున్నారని, వారితో కలిసి పనిచేయటం సంతృప్తినిచ్చిందని సౌజన్య చెబుతున్నారు. కానీ జగన్ ఆదేశిస్తే నందిగామ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తానని అంటున్నారు.
జగన్ సెక్యూరిటీ చీఫ్ జోషి మేనకోడలు ఆయన సౌజన్య.. మేనమామ పలుకుబడితోనే గతంలో జడ్పిటిసిగా పోటీ చేసి విజయం సాధించారు. అదే పలుకుబడితో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో మొండితోక జగన్ మోహన్ రావుకు టికెట్ ఇస్తారా?? లేదా జోషి మాటలు మన్నించి సౌజన్య ను బరిలోకి దించుతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా సీటు కోసం వర్గపోరు ముదిరితే నందిగామలో టిడిపి హవా కొనసాగడం ఖాయం.
ReplyReply allForward |