నిమ్మల రామానాయుడు టిడిపిలోనే కాదు, ఆంధ్ర ప్రజలకు కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఎమ్మెల్యేగా ఇప్పటికి రెండుసార్లు పాలకొల్లులో విజయం సాధించారు. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
2014లో నిమ్మల పాలకొల్లు నుంచి పోటీ చేయాలని ఆశించారు.కానీ టిడిపి తరఫున కూడా పాలకొల్లు నుండి చాలామంది అభ్యర్థులు పోటీకి ప్రయత్నించగా వారందరినీ పక్కనపెట్టి మరి టిడిపి పాలకొల్లు టికెట్ ను నిమ్మల దక్కించుకున్నారు. విజయం కూడా సాధించారు. పాలకొల్లులో గెలిచిన దగ్గర నుంచి టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ,త న తండ్రి పేరిట ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు.
2019లో జగన్ ప్రభంజనంలో కూడా పాలకొల్లులో టీడీపీ జెండా రెపలాడిందంటే నిమ్మల చేసిన అభివృద్ధి దానికి కారణం. ప్రతిపక్షనేతగా నిమ్మల తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. శాసనసభ నేతగా అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపటంలో నిమ్మలకు పోటీ ఎవరూ లేరన్నది జగమెరిగిన సత్యం. నిరసన కార్యక్రమాలు ఏవైనా నిమ్మలే మొదలుపెట్టాలి అని టిడిపి నాయకులు అంటున్నారు.
ఇక ఆడంబరాలు పోకుండా…సాధారణ జీవితం గడుపుతూ.అంతే సాధారణంగా ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో ముందు ఉంటారు. అందుకే పాలకొల్లులో నిమ్మలకు బలం ఎక్కువే. ఇప్పుడు కూడా అదే స్పీడ్ తో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని నిమ్మల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
నిమ్మలకు పోటీగా వైసిపి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచిస్తుంది. బీసీ అభ్యర్థి కవురు శ్రీనివాసును నిమ్మలకు పోటీగా వైసిపి నిలబెట్టాలని చూస్తోంది. కానీ నిమ్మల ముందు శ్రీనివాస్ నిలబడలేడు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో నేత కోసం చూస్తున్నారు. కానీ లెక్కల ప్రకారం చూసినా ఈసారి పాలకొల్లులో ఎగిరేది టిడిపి జెండానే!!! గెలిచేది నిమ్మల రామానాయుడే
ReplyReply allForward |