ఎమ్మెల్యేలు, మంత్రులతో జగన్ నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడిన మాటలు ఎమ్మెల్యేలు అందరినీ ఆలోచనలో పడవేశాయని చెప్పవచ్చు. అందరూ నా వాళ్ళే కానీ టికెట్ కొందరికే అని అనటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. సర్వేల ప్రకారం నియోజకవర్గంలో గెలుపు సాధ్యం అనుకున్న అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇస్తారని చెప్పకనే చెప్పారు.
సర్వే లెక్కల అంచనా ప్రకారం 35 నుంచి 40 మంది అభ్యర్థులకు ఈసారి టికెట్ ఉండదు అని తెలుస్తుంది. ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకపోయినా వేరే పదవి ఇస్తానని జగన్ చెబుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యే అయినా తర్వాత వేరే పదవి తీసుకోవడానికి అభ్యర్థులు ఇష్టపడతారో లేదో అని సందేహం కూడా ఉంది. టికెట్ ఇవ్వని ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్తారా లేదా జగన్ మీద అభిమానంతో వైసిపి లోనే ఉంటారా అనేది ప్రశ్నగానే ఉంది.
టికెట్ ఇవ్వని 40 మందిలో పార్టీ వీరాభిమానులు మాత్రం ఒక పది మంది మాత్రమే జగన్ ఇచ్చిన పదవికి ఒప్పుకుంటారని, మిగిలిన వారు వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తీసుకుంటారా? సొంత పార్టీ నుండే రెబల్ గా పోటీ చేస్తారా? లేదా సొంత పార్టీ లో ఉండి ప్రతీకారం తీర్చుకోవడానికి వైసిపి ఓటమికి ప్రయత్నిస్తారా? ఇలాంటి సందేహాలు ఎన్నో అందరి మదిలోనూ మెదులుతున్నాయి.
పైగా ఐప్యాక్ చెప్పినట్లు జగన్ నడుచుకుంటున్నారు. ఈ అంశంపై కూడా కొందరు ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉన్నారు. ఒకవేళ వారు చెప్పినట్లే కొందరికి సీట్లు ఇవ్వకపోతే వారు రెబల్ గా పోటీ చేయడమా? వేరే పార్టీలోకి వైసీపీ ఓటమికి కృషి చేసే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా జగన్ రిస్క్ తో కూడిన నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం వైసిపికి చేటు చేస్తుందని పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నారు.