ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ అభ్యర్ధి ఫిక్స్ అయ్యారు. తాజాగా నేతన్న నేస్తం పథకానికి బటన్ నోక్కేందుకు వెంకటగిరికి వెళ్ళిన జగన్..అక్కడ వైసీపీ అభ్యర్ధిని ప్రకటించారు. వైసీపీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. వాస్తవానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి టిడిపి వైపుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఏపీలో అనేక కీలక పదవులు చేపట్టిన ఆయనకు వైసీపీలో తగిన గౌరవం దక్కలేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటగిరిలో భారీ మెజారిటీతో గెలిచారు..సీనియర్ అయిన మంత్రి పదవి రాలేదు..అలాగే నియోజకవర్గానికి అభివృధ్దికి నిధులు రాలేదు. దీంతో ఆయన రివర్స్ అయ్యి..వైసీపీ నుంచి బయటకొచ్చారు. టిడిపి వైపుకు వచ్చేశారు. దీంతో వెంకటగిరి వైసీపీ ఇంచార్జ్ గా నేదురుమల్లిని పెట్టారు. ఇప్పుడు ఆయనే అభ్యర్ధి అని తేల్చి చెప్పేశారు. ఇక టిడిపిలోకి వచ్చిన ఆనం..వెంకటగిరిలో పోటీ చేయడం లేదు..ఆయన ఆత్మకూరు స్థానంలో పోటీ చేసే ఛాన్స్ ఉంది.
ఇక వెంకటగిరి నుంచి టిడిపి ఇంచార్జ్ కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. అయితే నెల్లూరులో వెంకటగిరి టిడిపికి కంచుకోట. 1983, 1985, 1994, 2009, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. రెండుసార్లు కురుగొండ్ల గెలిచారు. గత ఎన్నికల్లో ఆనంపై ఓడిపోయారు. ఇక నెక్స్ట్ ఈయనే టిడిపి నుంచి మళ్ళీ బరిలో దిగుతున్నారు. టిడిపి బలపడటం, అటు ఆనం సపోర్ట్ తో వెంకటగిరిలో ఈ సారి టిడిపి పైచేయి సాధించేలా ఉంది. ఇంకాస్త గట్టిగా పనిచేస్తే టిడిపికి తిరుగుండదు.