ఏ రంగంలోనైనా తొలి విజయం అనేది ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో తొలి విజయం చాలా విలువైంది..ఆ విజయంతోనే వారి భవిష్యత్తుకు బాటపడుతుంది. ఇప్పుడు అలాంటి తొలి విజయం దక్కించుకోవడానికి పలువురు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కొందరు నేతలు తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు.
వారితో పాటు ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసే నేతలు కూడా ఉన్నారు. ఇక తొలి విజయం కోసం పోరాడుతున్న వారిలో పలాసలో గౌతు శిరీష ఉన్నారు. గత ఎన్నికలో ఓడిపోయిన ఈమె.ఈ సారి విజయం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇటు విజయనగరంలో అతిథి గజపతి రాజు ఫస్ట్ విక్టరీ కోసం వెయిటింగ్. పార్వతీపురంలో విజయచంద్ర, నెల్లిమర్లలో బంగార్రాజు తొలి గెలుపు కోసం పోరాడుతున్నారు.
ఇక విశాఖలో బాలయ్య చిన్నల్లుడు భరత్ సైతం మొదట విజయం కోసం కష్టపడుతున్నారు. మడుగులలో పివిజి కుమార్, రాజానగరంలో బొడ్డు వెంకటరమణ, పి.గన్నవరంలో హరీష్ బాలయోగి, గోపాలాపురంలో మద్దిపాటి వెంకటరాజు, పోలవరంలో బొరగం శ్రీనివాసరావు..వీరంతా వైసీపీకి చెక్ పెట్టి మొదటి విజయం సాధించాలని చూస్తున్నారు. ఇక వీరిలో దాదాపు ఈ సారి గట్టెక్కేలా ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ అదే బాటలో ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ సారి మాత్రం ఆయన గెలుపు దిశగానే ముందుకెళుతున్నారు. బాపట్లలో వేగేశన సతీశ్ వర్మకు కూడా గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోవూరులో దినేష్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి, నగరిలో గాలి భానుప్రకాష్, పూతలపట్టులో మురళీమోహన్, సత్యవేడులో హెలెన్, జీడీనెల్లూరులో థామస్, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, కర్నూలు సిటీలో భరత్, ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి..ఇలా యువనేతలు తొలి విజయంపై ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఈ సారి చాలామంది తమ్ముళ్ళు మొదట విజయం దక్కించుకునే ఛాన్స్ ఉంది.
ReplyReply allForward |