ఎన్నికల సమయం దగ్గరకొచ్చేసింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో సత్తా చాటేలా చంద్రబాబు..టిడిపి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓ వైపు పార్టీని చూసుకుంటూనే..మరోవైపు ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే దాదాపు అన్నీ స్థానాల్లో టిడిపి ఇంచార్జ్లు ఉన్నారు. అందులో దాదాపు చాలామంది అభ్యర్ధులుగా బరిలో ఉంటారు. అయితే ఇంకా కొన్ని సీట్లలో ఇంచార్జ్లుని పెట్టాలి. అందులో బాబు సొంత జిల్లాలోని చిత్తూరు అసెంబ్లీకి కూడా ఇంచార్జ్ లేరు.
అది ఎందుకు ఖాళీగా వదిలారు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. చిత్తూరు జిల్లాలోని అన్నీ సీట్లలో ఇంచార్జ్లని పెట్టారు. ఆ మధ్య పూతలపట్టు, సత్యవేడు, గంగాధర నెల్లూరు స్థానాలలు కూడా ఇంచార్జ్లని నియమించారు. కానీ చిత్తూరు అసెంబ్లీ మాత్రం ఖాళీగా పెట్టారు. ఇక్కడ ఇంచార్జ్ పెడతారా? లేదా డైరక్ట్ అభ్యర్ధిని పోటీకి దింపుతారా? అనేది క్లారిటీ రావడం లేదు. మామూలుగా చిత్తూరు అసెంబ్లీలో టిడిపికి పట్టు తక్కువ. ఇప్పటివరకు అక్కడ టిడిపి గెలిచింది మూడుసార్లు మాత్రమే. 1983, 2004, 2014 ఎన్నికల్లోనే గెలిచింది.
గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు.తర్వాత ఆయన టిడిపిని వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి టిడిపికి ఇంచార్జ్ లేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులుపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. టిడిపికి సరైన నాయకుడు ఉండి పోరాడితే ప్లస్ అయ్యేది. నాయకుడు లేకపోవడం మైనస్. ఇప్పుడైనా కొత్త ఇంచార్జ్ని పెడతారా? అనేది క్లారిటీ లేదు.
ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఏ పార్టీలోనూ లేరు. ఆయన్ని టిడిపిలోకి తీసుకొచ్చి సీటు ఇస్తారా? అనేది చూడాలి. అలాగే ఈ సీటు కొసం టిడిపి నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలత ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ కాపు వర్గం హవా ఉంటుంది. దీంతో పొత్తులో భాగంగా జనసేనకు సీటు ఇస్తారనే డౌట్ ఉండి. చూడాలి మరి చిత్తూరు సీటు ఎవరికి దక్కుతుందో.