లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలో ఒక ఎత్తు..ప్రకాశం జిల్లాలో ఒక ఎత్తు అని చెప్పవచ్చు. మొదట పాదయాత్ర సాధారణంగానే మొదలైంది. మొదట్లో అనుకున్న మేర ప్రజా మద్ధతు లభించలేదు. కానీ టిడిపి శ్రేణులు భారీగానే పాల్గొన్నారు. అయితే నిదానంగా లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు…ప్రజా సమస్యల వింటూ, వాటిపై స్పందిస్తున్న తీరు ఆకట్టుకుంది. అలాగే జగన్ ప్రభుత్వం తప్పులు, ఎమ్మెల్యేల అక్రమాలు ఎత్తిచూపుతూ ముందుకెళ్లారు.
దీంతో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది. జిల్లా టూ జిల్లా ప్రజా బలం పెరుగుతూ వచ్చింది. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి లోకేష్ పాదయాత్రకు జనసంద్రంగా మారిపోయింది. ఉమ్మడి ప్రకాశంలోని కందుకూరులో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దర్శి వరకు ఊహించని స్థాయిలో ప్రజా మద్ధతు వచ్చింది. కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, అద్దంకి..ఇలా ఒక నియోజకవర్గానికి మించి..ఒక నియోజకవర్గంలో లోకేష్ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇక అద్దంకిలో చెప్పాల్సిన లేదు. ఇప్పటివరకు పాదయాత్రలో ఇదే హైలైట్. ఇలా ప్రకాశంలో పాదయాత్రకు ప్రజా స్పందన విపరీతంగా వస్తుంది. అలాగే టిడిపి నాయకులు పాదయాత్రని ఓ రేంజ్ లో సక్సెస్ చేస్తూ వచ్చారు. దీంతో ప్రకాశంలో టిడిపి బలం ఏంటో అర్ధమైపోయింది. అక్కడ ప్రజలు టిడిపికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ప్రకాశంలో 12 సీట్లు ఉంటే 4 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. టిడిపి 8 పైనే సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ప్రకాశంలో తెలుగు తమ్ముళ్ళు ఈ సారి సత్తా చాటడం ఖాయం.