ఏపీలో అధికార వైసీపీపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం..అందులో ఎలాంటి డౌట్ లేదు..కాకపోతే ప్రజలు ప్రస్తుతానికి స్తబ్దుగానే ఉన్నారు..సమయం వచ్చినప్పుడు ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందో చూపిస్తారు. టిడిపికి అనుకూలత ఎక్కువగానే ఉంది. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు బలం కనిపిస్తుంది. అయితే టిడిపి సింగిల్ గా వెళ్ళడం కంటే జనసేనతో పొత్తుతో వెళితే ఎక్కువ లాభమనే విశ్లేషణలు ఉన్నాయి. సరే ఇంతవరకు బాగానే ఉంది. కానీ పొత్తులో ఇప్పుడు కొత్త ట్విస్ట్లు వస్తున్నాయి.
తాజాగా పవన్…టిడిపి-జనసేన-బిజేపి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అనడం, అలాగే ఎన్నికల్లో గెలిచాక బలాబలాలని బట్టి అప్పుడు సిఎం అభ్యర్ధిని డిసైడ్ చేస్తామని చెప్పడం టిడిపిలో అలజడి రేపుతుంది. అసలు ఒక శాతం ఓట్లు లేని బిజేపితో ఎందుకు పొత్తు..పైగా ఏపీలో బిజేపికి యాంటీ ఉంది. అప్పుడు బిజేపితో కలిసి వెళితే అది టిడిపికే నష్టం. ఇక సిఎం సీటు అని చర్చ చేస్తున్నారు. చంద్రబాబు ఉండగా సిఎం సీటుపై చర్చ అనేది అనవసరం.
అసలు సిఎం అభ్యర్ధి బట్టే ఎన్నికలు జరుగుతాయి. అటు వైపు జగన్ ఫిక్స్ అయి ఉంటారు..ఇటు ఎవరు ఫిక్స్ కాకుండా ఎన్నికలకు వెళితే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి..మళ్ళీ వైసీపీ వైపే మొగ్గు చూపుతారు. కనీసం నిలకడగా సిఎం అభ్యర్ధి కూడా లేరని అనుకుంటారు. దాని వల్ల మళ్ళీ నష్టమని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. అందుకే అసలు బిజేపితో పొత్తు వద్దు..8 శాతం ఓట్లు పవన్..40 శాతం ఓట్లు టిడిపికి కండిషన్స్ పెట్టడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు.
అందుకే ఏ పొత్తుల గోల లేకుండా ఒంటరిగానే బరిలో దిగుదామని..బిజేపి-జగన్ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారని..అసలు బిజేపి అంటే..బిఆర్ఎస్, జగన్, పవన్ అని అంటున్నారు. మరి ఈ పొత్తు అంశంపై చంద్రబాబు ఎలా ముందుకెళ్తారో చూడాలి.