చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో పరిస్థితులన్నీ తారుమారయ్యాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఆపేవారు కానీ, అన్యాయాలకు అడ్డుపెట్టేవారు గాని లేకుండా పోయారన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టిడిపి నేతలు అంతా రోడ్లపైకి వచ్చారు. తమ నాయకుని అరెస్టును నిరసిస్తూ స్వచ్ఛందంగా బందులు, రాస్తారోకోలు నిర్వహించారు. నిరసనలు, ర్యాలీలు చేపట్టారు కానీ ఫలితం మాత్రం శూన్యం అనే చెప్పవచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఈ నిరసనల్లో బిజీగా ఖాళీ లేకుండా ఉన్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో ఇప్పుడు టిడిపి శ్రేణులు లేరు అనేకంటే వారిని ఆ స్థితిలోకి జగన్ తీసుకువచ్చారు అనడమే కరెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపి నేతలు అంతా నిరసనల్లో ఉంటే వైసిపి వారు మాత్రం ఓట్ల తొలగింపులో బిజీగా ఉన్నారు. 13 లక్షలకు పైగా Form 7 అప్లికేషన్లు వచ్చాయి అంటే ఓట్లు తొలగింపు కోసం ప్రయత్నాలు ఏ విధంగా జరిగాయో అంచనా వేయవచ్చు. మరణించిన వారి ఓట్లు తొలగించడం సర్వసాధారణం, కానీ ఇప్పుడు టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం సర్వసాధారణంగా మారిందని అందరూ రాజకీయ వర్గాలు అంటున్నారు.
వాలంటీర్లు సహాయంతో టిడిపి సానుభూతిపరులు ఎవరో తెలుసుకొని వారి ఓట్లను ఏదో ఒక కారణంతో తొలగించాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఓట్ల తొలగింపు గురించి కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి మొర వినిపించుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత వాటి గురించి ప్రశ్నించే నాధుడే కరువయ్యారని చెప్పవచ్చు.
ఇప్పుడు వైసీపీ వారు సచివాలయ సిబ్బంది అనే తన సొంత బలగం సహాయంతో ఇష్టం వచ్చినట్లు ఓట్లు తొలగిస్తున్నారని టిడిపి వర్గాలతో పాటు, సామాన్య ప్రజలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. అంతకుముందు ఉపాద్యాయులు, మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే ఓట్ల తొలగింపు, ఓట్ల చేర్పు వంటి కార్యక్రమాలు చేసేవారు, కానీ ఇప్పుడు సచివాలయ సిబ్బందితో ఈ పనులన్నీ చేయిస్తూ ఉండడంతో టిడిపి వారి ఓట్లను తొలగిస్తున్నరని అనుమానాలు అందరికీ వస్తున్నాయి. మరి ఇప్పటికైనా టిడిపి వారు కళ్ళు తెరవకపోతే తమ అమూల్యమైన ఓట్లను లక్షల సంఖ్యలో కోల్పోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి
ReplyReply allForward |