ఒంగోలు ఎప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఒంగోలు నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఐదు సార్లు గెలిచారు,ఈసారి కూడా విజయం సాధించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డి కి మధ్య పచ్చగడ్డి లేకుండానే భగ్గుమనే విభేదాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు కూడా ఇవ్వకపోవడంతో అలక వహించిన బాలినేని ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.
వై వి సుబ్బారెడ్డి పై ఉన్న కోపంతో బాలినేని సొంత పార్టీ వారిపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు.నకిలీ స్టాంపులు,డాక్యుమెంట్ల కుంభకోణం అంటూ బాలినేని తమ పార్టీ వారిపైన కలెక్టర్ కు,ఎస్పీకి ఫిర్యాదు చేశారు.అలాగే ఇళ్లపట్టాల పంపిణీలో బాలినేని అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఆ విమర్శలలో సుబ్బారెడ్డి హస్తం ఉందని బాలినేని విమర్శీస్తున్నారు. ఈసారి ఎంపీగా వైవి సుబ్బారెడ్డి తనయుడు వై వి విక్రాంత్ రెడ్డిని నిలబెట్టాలని ఆలోచనలో ఉండడం వల్ల బాలినేని అడ్డుతప్పించేందుకు వైవి ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఎం పి మాగుంట శ్రీనివాసులు,బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ ఏకమై ఈసారి వైసీపీలో తమ గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పవచ్చు.ఈసారి ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పేరును అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ వారే బాలినేని ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్న తరుణంలో బాలినేని పార్టీ మారుతారని వార్తలు కూడా వినిపించాయి.కానీ బాలినేని ఈసారి వైసీపీ నుంచే పోటీ చేసి విజయం సాధిస్తామని,తనపై విమర్శలు చేసిన వారి నోరులు మోయిస్తానని ధీమాగా చెబుతున్నారు.
ఒంగోలులో టిడిపి తరఫున దామచర్ల జనార్ధన్ ఉన్నారు.ఒంగోలులో టిడిపికి బలం ఉంది.కమ్మ ,కాపు సామాజిక వర్గ ఓటర్లు ఈ నియోజకవర్గంలో గెలుపును శాసిస్తారు.జనసేన పార్టీ తో పొత్తు ఉండటం వల్ల టీడీపీకి ఇక్కడ కాపు ఓట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేన పార్టీ నేత షేక్ రియాజ్ కు ఒంగోలులో మంచి పట్టు ఉంది.
వైసీపీలోని ఆధిపత్య పోరును టిడిపి జనసేన పొత్తు తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధిస్తుందా లేదా అని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. మరి ఒంగోలులో ఈసారి బాలినేని గెలుస్తారా దామచర్ల విజయం సాధిస్తారా వేచి చూడాల్సిందే.