వచ్చే ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీట్లు ఇవ్వడం కష్టమనే చెప్పవచ్చు. ప్రజా వ్యతిరేకతతో ఉన్న ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని ఇప్పటికే చెప్పేశారు. దీంతో జగన్..కొందరు ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు జగన్ హ్యాండ్ ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం వస్తుంది. దర్శి సీటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇస్తారని తెలుస్తుంది.
వాస్తవానికి ఇది బూచేపల్లి సీటు 2009లో ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు. 2014లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పడంతో మద్దిశెట్టి రంగంలోకి వచ్చారు. ఈయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో వైసీపీ నుంచి గెలిచారు. ఎమ్మెల్యేగా గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదు. పైగా జగన్ బటన్ నొక్కి డబ్బులు ఇస్తే ఆయన గ్రాఫ్ పెరుగుతుందని, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా పనులు చేయకపోవడం వల్ల తమ గ్రాఫ్ పెరగదని మద్దిశెట్టి కామెంట్స్ చేశారు.
ఆ వెంటనే బూచేపల్లిని నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించారు. ఈ దెబ్బతో దర్శి సీటు బూచేపల్లిదే అని తెలుస్తుంది. అయితే మద్దిశెట్టి వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక బూచేపల్లికే సీటు ఫిక్స్ చేస్తే మద్దిశెట్టి జనసేనలోకి జంప్ చేసి..టిడిపి పొత్తుతో పోటీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి అక్కడ టిడిపి ఇంచార్జ్ కూడా లేరు. పమిడి రమేష్ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసి సైలెంట్ గా ఉన్నారు. జనసేన కోసమే ఆ సీటు టిడిపి వదిలేసిందని తెలుస్తుంది. మొత్తానికి మద్దిశెట్టి జంప్ అయ్యేలా ఉన్నారు.