కడప జిల్లా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. కడప అసెంబ్లీ స్థానం ఒకప్పటి టిడిపి కంచుకోట. తర్వాత వైయస్సార్ హయాంలో 2004 నుంచి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతూ వస్తుంది. అప్పటినుండి కాంగ్రెస్ తర్వాత,వైసీపీ అభ్యర్థులు మాత్రమే గెలిచారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ బాషా వైసిపి తరఫున గెలిచి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు కూడా వైసిపి తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ కడపలో టిడిపి కి గట్టి ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపి క్యాడర్ కడపలో బలంగానే ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు. అంజాద్ బాషా పై ముస్లింలలోని తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈసారి బాషా తమకు వద్దని బహిరంగంగానే వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఈసారి కడపలో టిడిపి జెండా ఎగరేయాలని టిడిపి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.సరైన అభ్యర్థిని నిలబెడితే కడప నియోజకవర్గం టిడిపి సొంతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అందుకోసం టిడిపి వారు కసరత్తు కూడా ప్రారంభించారు.
టిడిపి అభ్యర్థిగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి భార్య అయిన మాధవి రెడ్డిని టిడిపి తమ అభ్యర్థిగా ప్రకటించింది. అంజాద్ భాషా పై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రజలలో ఉండడంతో ఈసారి అక్కడ టిడిపి జెండా ఎగరవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.టిడిపి నాయకులు మాత్రం అందరూ ఒకే తాటిపై ఉండి కృషి చేస్తే కచ్చితంగా కడపలో టిడిపి జెండా ఎగర వేయగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి వారి నమ్మకం ఫలిస్తుందో?? లేదో?? మరి ఏమవుతుందో…