ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలన్నీ పొత్తులు గురించి చర్చించుకుంటున్నాయి.బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.బిజెపిలో ఉన్న నాయకులలో ప్రజలలో పట్టున్న నాయకులు కొంతమంది మాత్రమే ఉన్నారు.వారందరూ బిజెపి టిడిపి జనసేన కూటమితో పొత్తు లో ఉండాలి అని కోరుకుంటున్న వారేఎక్కువగా ఉన్నారు. టిడిపి జనసేన పొత్తులో బిజెపి కలవక పోయినట్లయితే బిజెపిలోని కొందరు ముఖ్య నేతలు బిజెపిని వదిలి టిడిపి కానీ జనసేనలో గాని చేరతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టిడిపి తో పొత్తు విషయంలో బిజెపి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.
బిజెపి నేతలు టిడిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.వారిలో కైకలూరు టికెట్ ఆశించిన కామినేని శ్రీనివాస్,విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ , భూమకిషోర్ రెడ్డికి ఆళ్లగడ్డ నుంచి ఈయనకు టికెట్ కన్ఫమ్ అయ్యింది అని రాజకీయ అని సన్నిహితులు అంటున్నారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి సూర్యనారాయణ వీరందరూ టిడిపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ కూడా టిడిపి ప్రభుత్వం ఆ నియోజకవర్గాల నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు కూడా సన్నిహిత వర్గాలు అంటున్నాయి.అంతేకాక వీరు బయటకి వస్తామని బహిరంగంగా చెబుతున్న నేతలు,కానీ అలా బయటికి చెప్పని నేతలు ఇంకెందరున్నారో?బిజెపిలో టిడిపి తో పొత్తు గనక లేనట్లయితే బిజెపిలో ఉన్న నేతలందరూ తమ దారి చూసుకుంటారని,బిజెపి ఖాళీ అవుతుందని రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి.
మరి ఏమవుతుందో బిజెపి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.