ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాలన్నీ ఎన్నికలపైనే తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల బలాబలాలను గూర్చి సర్వేలు చేస్తున్నాయి. వైసిపి తొలి జాబితా అంటూ ఒక జాబితా కూడా హల్చల్ చేస్తోంది. కానీ టిడిపి మాత్రం ఆ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఎన్నికల గురించి ఆలోచించడం మానేసిందని రాజకీయ వర్గాలు అంటున్నారు. అరెస్టు తర్వాత కార్యకర్తలందరూ నిరసనలు తెలపడంలోనే తమ సమయం మొత్తాన్ని కేటాయించారు,కానీ ఎన్నికల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదన్నది జగమెరిగిన సత్యం. కానీ జైల్లో ఉన్నప్పుడు బాబు పార్టీ, ప్రజల గురించే ఆలోచన చేశారు. అలాగే ములఖాత్ సమయంలో చంద్రబాబు నాయుడు లోకేష్ కు టిడిపి తొలి అభ్యర్థుల జాబితా అందజేశారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులకు లోకేష్ ఫోన్ చేసి చెప్పారని, ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లు చేసుకోమని చెబుతున్నారని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. జనసేన తో పొత్తు నేపథ్యంలో కొన్ని సీట్లు ఆపి..మిగిలిన వాటికి అభ్యర్థులు ఫిక్స్ అని తెలుస్తోంది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలపై చంద్రబాబు నాయుడు కు పట్టు ఉంది.ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెడితే విజయం సాధించవచ్చో కూడా వారికి తెలుసు. అందుకే ఆయన జైలులో ఉన్న సరే అభ్యర్థుల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు ఆయన బయటకొచ్చారు. రాజకీయంగా ఎలాంటి కార్యక్రమం చేయకపోయినా ఇంటర్నల్ గా బాబు అభ్యర్థుల ఎంపిక పనిలో ఉన్నారని తెలిసింది.
త్వరలోనే టీడీపీ తొలి జాబితా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.