తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. చంద్రబాబు బయటకు రావడంతో జనసేన పొత్తు అంశం..అభ్యర్థుల ఎంపికపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమం లో కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై ఆలోచన చేస్తున్నారని తెలిసింది.
ఈ క్రమంలో ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఇన్చార్జిగా ఉన్నారు. ఈసారి కూడా తనకి టికెట్ లభిస్తుందని భూమా అఖిలప్రియ ఆశించారు. కానీ భూమా అఖిలప్రియ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండడం,ఆమె ఎప్పుడూ వివాదాలలో ఉండడంతో,ఈసారి ఆమెను పక్కన పెట్టి వేరే వారికి టికెట్ ఇవ్వాలని ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు భూమా కుటుంబం నుంచి వచ్చిన భూమా కిషోర్ రెడ్డి. కిషోర్ రెడ్డికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో ఉన్నారు.కానీ టిడిపిలో తనకంటూ సొంత క్యాడర్ ను ఏర్పరుచుకున్నారు. సొంత ఓటు బ్యాంకును పెంచుకున్నారు.తన కేడర్ ను బలోపేతం చేసుకోవడానికి బోలెడంత ఖర్చు పెట్టారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
బీజేపీ కిషోర్ రెడ్డి రాజకీయాలలో ఒక స్టాండ్ గా మాత్రమే ఉపయోగించుకున్నారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఆళ్లగడ్డలో బిజెపికి అనుకూల ఓట్లు లేవు, ఎక్కువగా మైనారిటీ ఓట్లే ఉన్నాయి.కానీ కిషోర్ రెడ్డి బిజెపిలో ఎందుకు చేరారంటే రాజకీయంగా తనకు ఏదో ఒక పార్టీ అండ కావాలని,అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే తాము స్థిరంగా రాజకీయాల్లో కొనసాగవచ్చని ఉద్దేశంతో కిషోర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నారు. ఇప్పుడు టిడిపిలో పట్టు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో,సర్వేలు,టిడిపి పెద్దలు అందరూ భూమా కిషోర్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నాయి.
మరి చూడాలి ఆళ్లగడ్డ సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.