రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసిపి వ్యూహాలు రచిస్తోంది.రోజుకు ఒక మాట తో ప్రజలలో ఉత్కంఠను పెంచుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ అధినేత జగన్ పోటీ చేస్తారని వార్తలతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
విశాఖ నుంచి జగన్ పరిపాలన కొనసాగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పుకారు వాస్తవమా అని ప్రజలను ఆలోచనలో పడేసాయి. ఈసారి ఎన్నికల్లో వైసిపి విజయం కష్టమే అని సర్వేలు చెబుతుంటే,వైసీపీ మాత్రం ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతామని చెబుతున్నారు.
వైసీపీకి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం వీటిలో మాత్రమే వైసిపికి మంచి పట్టు ఉంది అనేది వాస్తవం. ఉత్తరాంధ్ర,ఉభయగోదావరి,కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసిపి అంటే తీవ్ర వ్యతిరేకత ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఉభయగోదావరి జిల్లాల్లో టిడిపికి మంచి పట్టు ఉందని తెలుసు,ఇప్పుడు టిడిపి జనసేన పొత్తులో వైసిపి కష్టపడితే కానీ పది సీట్లు సంపాదించలేని పరిస్థితి అని అందరికీ తెలిసిన విషయమే.కృష్ణా, గుంటూరులో అయితే రాజధాని మార్పు, అమరావతి కట్టడాల నిర్మాణం ఆపివేయడంతో వైసిపి అంటే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉత్తరాంధ్ర ఎప్పటినుంచో టీడీపీకి కంచుకోట.ఇప్పుడు జనసేన పొత్తు కూడా తోడవడంతో వైసిపి గెలుపు ఉత్తరాంధ్రలో కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం 34 స్థానాలలో 25 స్థానాలు వైసిపి దక్కించుకుంటుందని,సర్వేలు చెబుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఆ సర్వేలో నిజమెంతో తెలియదు కానీ,ఆ సర్వేని నిజం చేయాలంటే అక్కడి నుంచి జగన్ కచ్చితంగా పోటీ చేసి తీరాలని వైసిపి నాయకులందరూ,జగన్ ను అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి జగన్ కంచుకోట లాంటి పులివెందులను వదిలి ఉత్తరాంధ్ర వైపు చూస్తారా????