గత కొన్ని నెలలుగా ఏపీలో వర్షాలు తక్కువగా ఉన్నాయి అనేకంటే అసలు లేవు అని చెప్పవచ్చు.అయితే అతివృష్టి లేదా అనావృష్టితో ఆంధ్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో సరైన వర్షం పడక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు.కావలసిన సమయంలో వానలు పడక పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడి అన్నదాత కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు.ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం వర్షాలు పడక ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడ్డారని ప్రచారం చేస్తూ వచ్చారు.కానీ ఇప్పుడు వర్షం పడకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి ఉండడం వల్ల వర్షం పడలేదు కదా అని టిడిపి నేతలతో పాటు సామాన్యుల సైతం ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఇలా అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు రైతులకు కావలసిన సహాయ సహకారాలు వేగంగా అందేవి అని రైతులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.అతివృష్టితో చేతికొచ్చిన పంట తడిచినప్పుడు ఆ తడిసిన ధాన్యాన్ని కి సరైన మద్దతు ధర తో కొనిపించడం చంద్రబాబు నాయుడుకే చెల్లింది అని రైతులందరూ గొప్పగా చెబుతున్నారు.అనావృష్టి సమయంలో ఇంకుడు గుంటలు,డ్రిప్ ఇరిగేషన్, బోర్లు ఇలా ప్రత్యామ్నాయ మార్గాలను చంద్రబాబు నాయుడు సూచించే వారిని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఉన్నత అధికారులతో సమీక్షలు నిర్వహించి అవసరమైన సహాయం అందించడంలో చంద్రబాబు నాయుడు ముందుండే వారిని అంటున్నారు.కానీ జగన్ ప్రభుత్వంలో అటువంటివి మచ్చుకైనా కనిపించడం లేదని వాపోతున్నారు.
రాయలసీమ వైసీపీకి,జగన్మోహన్ రెడ్డికి కంచుకోట లాంటిది అని అందరూ చెబుతున్నారు. కానీ రాయలసీమలో జగన్ కు సానుకూలత లేదు. వ్యతిరేకత ఎక్కువగానే ఉంది.ఆ వ్యతిరేకతను టిడిపి వారు తమకు అనుకూలంగా మార్చుకుంటే రాయలసీమలో కూడా టిడిపి పట్టు సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..