రాష్ట్రంలో రాజకీయాలు రోజుకు ఒక రకంగా మారుతున్నాయి.గెలుపు కోసం అధికార పార్టీ చేయని కార్యక్రమం లేదు.అటువంటి వాటిలో ఒకటి వైసీపీకి వెన్నుముక లాంటి సోషల్ మీడియా.ఇది అందరికీ తెలిసినదే.ప్రజలలో కన్నా సోషల్ మీడియా ద్వారా వైసీపీకి పబ్లిసిటీ ఎక్కువగా ఉంది అనేది వాస్తవం.వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు అంటే వైసీపీ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వడం లేదని జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.ఆ విమర్శ చేసింది ఎవరో కాదు స్వయానా వైసిపి వీరాభిమాని శ్రీ రెడ్డి,అవునండి ఎవరైనా వైసీపీకి వ్యతిరేకం గా మాట్లాడితే ఎల్లో మీడియా,కమ్మ సామాజిక వర్గం,టిడిపి అభిమానులు ఇష్టం లేక విమర్శలు చేస్తున్నారు అని చెప్పే వైసిపి నేతలు శ్రీ రెడ్డి వీడియోకు మౌనంగా ఉన్నారంటే,డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు అనేది నిజమనే కదా.
ప్రతి నెల వైసీపీ సోషల్ మీడియాకు 10 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టగల స్తోమత ఉంది. ఇప్పటివరకు అలా ఖర్చు పెడుతూనే వచ్చారు. కానీ గత రెండు నెలలుగా ఆ ఖర్చును అనవసరం అనుకున్నారో,అక్కర్లేదనుకున్నారో సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడం ఆపేసారట.ఆ డబ్బులు వైసీపీకి ఎక్కువేమీ కాదు. వైసిపి ఆదాయానికి గాని,వస్తున్న నిధులు విరాళాలలో గాని పోల్చుకుంటే సోషల్ మీడియాకు చేసే ఖర్చు చాలా తక్కువ.కానీ వైసిపి ప్రభుత్వం సోషల్ మీడియాకు నిధులు ఇవ్వకుండా ఎందుకు ఆపతుందో?? ఇది అనవసర ఖర్చు అనుకుంటున్నారా?దీనివల్ల ఉపయోగం లేదు అనుకుంటున్నారా?మరి ఇలా మధ్యలో వదిలేస్తే ఇన్నాళ్లు వైసిపి సోషల్ మీడియాని నమ్ముకుని ఉన్న జర్నలిస్టులు,మేధావులు,సోషల్ మీడియా ఆక్టివిస్టుల పరిస్థితి ఏంటో!!
వైసిపి సోషల్ మీడియా ఫేక్ అని శ్రీ రెడ్డి వీడియోతో ప్రజలందరికీ తెలిసింది.సోషల్ మీడియా ఇప్పటికైనా ఇటువంటి ఫేక్ ప్రచారాలను పక్కనపెట్టి వాస్తవ పరిస్థితులను ప్రజలకు చూపిస్తారని ఆశిద్దాం…