2024 ఎన్నికల్లో 18 కి పైగా ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో తమ సత్తా చాటాలి అని వైసిపి నేతలు ఆశ పడుతున్నారు.అది జరుగుతుందో లేదో ఎన్నికల తర్వాత గాని తెలియదు.గతంలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కొన్ని పార్లమెంటు స్థానాలలో ఈసారి ఎవరిని అభ్యర్థిగా నిలబడితే గెలుపు సాధ్యమవుతుందని వైసిపి ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.అటువంటి స్థానాలలోని ముఖ్యమైనది హిందూపూర్ పార్లమెంట్ స్థానం.ఇక్కడ 2019లో గోరంట్ల మాధవ్ భారీ మెజారిటీతో గెలిచారు.ఇతను తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.కానీ గెలిచిన తర్వాత వివాదాలలో చిక్కుకున్నారు.ఆ వివాదాలు అతనికి వ్యక్తిగతంగానే కాకుండా పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చాయని చెప్పవచ్చు.
హిందూపూర్ వైసీపీకి కంచుకోట ఏమీ కాదు, ఒకప్పటి టిడిపి కంచుకోట.హిందూపూర్ లో ఎన్నికలలో గెలుపును నిర్ణయించేది బిసి ఓటర్లే. గతంలో బీసీ అభ్యర్థులు మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారని చెప్పవచ్చు.హిందూపూర్ ఎంపీ స్థానాన్ని టిడిపి పెనుగొండ హిందూపూర్ లో ఉన్న టిడిపి క్యాడర్ తో విజయం సాధిస్తున్నారు,కానీ ఈసారి హిందూపూర్ నుంచి గోరంట్ల మాధవ్ ని కాకుండా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ను నిలబెట్టాలని ఆలోచనలో వైసిపి ఉన్నట్లు తెలుస్తోంది.అప్పటికప్పుడు అభ్యర్థి మార్పు అంటే ఆలోచించాల్సిన విషయమే,అభ్యర్థి మారిస్తే క్యాడర్ ఎలా తీసుకుంటుందో నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎలా తీసుకుంటారు అని వైసిపి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మూడు నెలల నుంచి హిందూపూర్, పెనుగొండ,కదిరి,మడకశిర,రాప్తాడు,పుట్టపర్తి నుండి నియోజకవర్గాల నుంచి సర్వే నివేదికలను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఆ నివేదికల ద్వారా ఎవరిని ఎక్కడ నిలబెడితే వైసీపీ విజయం సాధిస్తుందో అని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం హిందూపూర్ నుంచి ఎవరిని తమ అభ్యర్థిగా వైసిపి ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే..