ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. అధికార వైసీపీకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిందని చెప్పవచ్చు. ఇన్చార్జిలో మార్పుతో ఎమ్మెల్యేలే దూరమవుతున్నారు అని వైసిపి ఆందోళనలో ఉంటే, ఇప్పుడు ఎంపీలు కూడా పార్టీని విడతారనే వార్తలు వైసిపిని అయోమయంలో పడవేశాయని చెప్పవచ్చు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున 22 మంది ఎంపీలు గెలిచారు. వారిలో ఎన్నికలు జరిగిన తర్వాత రఘురామకృష్ణంరాజు బయటికి వచ్చారు. తర్వాత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కర్నూలు ఎంపీ, మచిలీపట్నం ఎంపి కూడా పార్టీని వీడారు. మిగిలిన 18 మందిలో సీటు రాకుంటే పార్టీని విడతామని సంకేతాలు పార్టీ నాయకులకు అందజేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు దూరం అవుతారని ఆలోచనలో ఉన్న వైసీపీ అధినేతకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చేసిన ట్వీట్ మరింత ఆందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు. వైసీపీలోని ఎంపీలు తమ కాంగ్రెస్ తోటి వేరే పార్టీలతోటి టచ్ లో ఉన్నారని, పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెను సంచలనంగా మారాయి. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ వీర విధేయులుగా ఉన్నవారు కొందరు మాత్రమే వైసీపీలో ఉంటారన్నది వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడున్న పరిణామాలను చూస్తే వైసీపీలో చివరికి మిగిలేది అయిదు ఆరుగురు ఎంపీలే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ పరిస్థితులను వైసిపి ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాల్సిందే….