వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజలలోకి వైసిపి ని బలంగా తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వై నాట్ 175 కాదు కానీ వాటిలో సగం కూడా ఈసారి వైసిపికి రావన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే మాట వైసీపీలో కొందరు కూడా అనుకుంటున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.
శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బలం ఎంత? టిడిపి వైపు ఎన్ని సీట్లు వస్తాయో? చూద్దామా…
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.వీటిలో ఐదు నియోజకవర్గాలు టిడిపికి, ఒకటి వైసీపీకి, ఒక నియోజకవర్గం లో మాత్రమే హోరాహోరీ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇచ్చాపురం నుంచి టిడిపి అభ్యర్థి బెందానం అశోక్ గెలిచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా విజయ ప్రకటించిన తర్వాత గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది. పలాస నుంచి వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెక్కలి ఇది పూర్తిగా టిడిపికి అనుకూలమైన నియోజకవర్గం. ఇది అచ్చన్న నాయుడు సొంత నియోజకవర్గ కావడంతో ఇది టిడిపికే అని తెలుస్తోంది. నరసన్నపేట ఈ నియోజకవర్గంలో ధర్మాన కృష్ణ దాస్ వైసిపి తరఫున పోటీ చేస్తున్నారు టిడిపి తరఫున అభ్యర్థిని ప్రకటించకపోయినా ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం టిడిపినే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ధర్మాన ప్రసాదరావు వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ధర్మాన పైన ఉన్న తీవ్ర అసంతృప్తి వల్ల టిడిపికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆముదాలవలస ఇది కూడా టీడీపీకే. కూన రవికుమార్ టిడిపి తరఫున పోటీ చేస్తుండగా తమ్మినేని సీతారాం వైసిపి తరఫున బరిలో ఉంటారని తెలుస్తోంది. తమ్మినేని సీతారాంపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే రవికుమార్ విజయం సునాయాసమే అని తెలుస్తుంది. పాతపట్నం నుంచి టిడిపి అభ్యర్థులుగా కలమట వెంకటరమణ, మామిడి గోవిందరాజు పోటీపడుతుండగా మామిడి గోవిందరాజుకే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎవరిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన గెలుపు మాత్రం టిడిపిదే.
ReplyReply allForwardAdd reaction |