రాబోయే ఎన్నికలు టిడిపికి చావో రేవో వంటివి అని చెప్పవచ్చు. ఈసారి గెలిచి అధికారంలోకి రావడమే టిడిపి లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన అంతమొందించాలని టిడిపి జనసేన కూటమి గా ఏర్పడి ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని కీలక నియోజకవర్గాలలో అభ్యర్థి ప్రకటించకపోవడంతో టీడీపీ నేతలలో అసంతృప్తి కనిపిస్తోంది. అధికార పార్టీ వైసిపి ఇంచార్జిల మార్పుతో కొత్త ఇంచార్జిలను ఏర్పాటు చేసి నేతలలో నూతన ఉత్సాహం నింపారని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితులలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో తెలివైన నిర్ణయాలతో టిడిపి విజయానికి నాంది పలకడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.
పాతపట్నం నియోజకవర్గం నుంచి కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు వీరు ఇరువురు టిడిపి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టిడిపి అధినేత సర్వేలు నిర్వహించి మరి ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకున్నారు. వాటి ప్రకారం మామిడి గోవిందరావుకు టికెట్ ఖరారు అయినట్లే అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి నియోజకవర్గం పొత్తులో జనసేనకు ఇస్తే తప్ప లేదంటే ఆ నియోజకవర్గ నుంచి కోడూరు బాలసుబ్రమణ్యం కు టికెట్ ఇవ్వాలని టిడిపి అధినేత భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే జనసేన టిడిపి పొత్తులో భాగంగా రాజోలు, రాజానగరం, నెల్లిమర్ల, భీమవరం, ఆళ్లగడ్డ మొదలైన స్థానాలను జనసేన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధినేత గెలుపు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!!!!