ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధికార వైసిపి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల ప్రచారానికి తెరలేపిందని చెప్పవచ్చు. కానీ టిడిపి జనసేన ఇంకా అభ్యర్థులు ఎవరో ప్రకటించకపోవడంతో టిడిపి జనసేన కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారని చెప్పవచ్చు. అయినా ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఈసారి టిడిపినే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విజయనగరం పార్లమెంటు పరిధిలో టిడిపి జనసేన గెలిచే స్థానాలు ఎన్నో? వైసీపీ వైపు ఎన్ని స్థానాలు ఉంటాయో? తెలుసుకుందామా!
విజయనగరం పార్లమెంటు పరిధిలో రాజాం, ఎచ్చెర్ల, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, నెలిమర్ల, గజపతినగరం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో రాజాం ఎస్సీ రిజర్వుడు స్థానం కాగా, ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కొండ్రు మురళీమోహన్ ను ప్రకటించారు. వైసీపీ తరఫున ప్రముఖ డాక్టర్ కు టికెట్ ఇచ్చారు. అయినా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎచ్చెర్ల నుంచి టిడిపి అభ్యర్థుల మధ్యనే తీవ్ర పోరు ఉంది. కానీ ఇక్కడ టిడిపినే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బొబ్బిలి లో టిడిపికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చీపురుపల్లి మాత్రం వైసీపీకే. విజయనగరం కోలగట్ల వీరభద్ర రాజు వైసిపి తరఫున పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున అశోక్ గజపతిరాజు విజయం దాదాపు ఖరారే అనుకున్న సమయంలో వీరభద్రరాజు రూపంలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. నెల్లిమర్ల టిడిపి జనసేన పొత్తులో హోరాహోరీ పోరు మధ్య టిడిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గజపతినగరం కూడా వైసిపికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విజయనగరం పార్లమెంటు స్థానంలోని ఏడో అసెంబ్లీ నియోజకవర్గం లో మూడు టీడీపీకి, రెండు అసెంబ్లీ స్థానాలు వైసిపికి, రెండు అసెంబ్లీ స్థానాలు హోరాహోరీ మధ్య టిడిపినే గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఎన్నికల సమయానికి ఓటర్లు ఏ పార్టీకి ఓటేస్తారో చూడాల్సిందే….!
ReplyReply allForwardAdd reaction |