రాజకీయ చైతన్యం గల నియోజకవర్గాలలో సర్వేపల్లి ఒకటి. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది.ఏ పార్టీ అభ్యర్థి అయినా ఈ నియోజక వర్గం నుండి రెండుసార్లు మాత్రమే గెలుస్తారు. మూడోసారి గెలుపు అన్నది ఈ నియోజకవర్గ చరిత్రలోనే లేదు.ఏ అభ్యర్థి అయినా రెండుసార్లు విజయం సాధిస్తే మూడోసారి కచ్చితంగా ఓటమి పొందుతారు. 1994,99 లో సోమి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, 2004,2009 లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, 2014,2019 లో కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచారు.కానీ ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజలలో వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టిడిపి విఫలమైందని చెప్పవచ్చు. రెండు దశాబ్దాలుగా సోమిరెడ్డి సర్వేపల్లి నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు కానీ విజయం సాధించలేకపోయారు. ఆ సానుభూతితో ఈసారి గెలుస్తానంటూ సోమిరెడ్డి ఆశపడుతున్నారు.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం సర్వేపల్లి. కృష్ణపట్నం పోర్టు,పోర్టు ఆధారిత పరిశ్రమలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. గతంలో సోమిరెడ్డి నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేశారు.
ఇటు మంత్రిగా కాకానిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్,ఇసుక,ధాన్యం కొనుగోలు,కోర్టు ఫైల్స్ మాయం ఇలా ప్రతి విషయంలో కాకానిపై నెగిటివ్ ఉంది. అయితే సర్వేపల్లిలో వైసీపీకి పట్టు ఎక్కువ కాబట్టి గెలుపు కోసం సోమిరెడ్డి ఇంకా కష్టపడాలి..అలాగే మూడోసారి సెంటిమెంట్ కాకానికి మైనస్.
ReplyReply allForward |