ఎన్నికల సమయం వచ్చేసింది. దీంతో గెలుపోటములపై, అభ్యర్ధుల బలాబలాలపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ప్రతి పార్టీ సొంత సర్వేలు నిర్వహించుకుంటుంది. అదే సమయంలో థర్డ్ పార్టీ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అటు మీడియా సంస్థలు సైతం సర్వేలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో పలు జాతీయ మీడియా సంస్థలు జాతీయ స్థాయిలో సర్వేలు నిర్వహిస్తూనే…తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్వేలు చేస్తున్నాయి.
ఇప్పటికే పలు జాతీయ సంస్థలు సర్వేలు విడుదల చేశాయి. ఇక అన్నీ సర్వేల్లో వైసీపీ హవా ఉంటుందని తేల్చి చెబుతున్నాయి. ఇలా చెప్పడం వెనుక లాజిక్ ఏంటో ఏపీ ప్రజలకు కూడా బాగా తెలుసు.పెయిడ్ సర్వేలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. ఇదే క్రమంలో ఆ మధ్య ఏప్రిల్ లో సర్వే ఇచ్చి..వైసీపీ ఎంపీ సీట్లని క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పిన టైమ్స్ నౌ సంస్థ..ఇప్పుడు జూన్-ఆగష్టు 12 వరకు సర్వే చేశామని చెబుతూ..ఒక సర్వే విడుదల చేసింది. ఎలాగో జాతీయ స్థాయిలో బిజేపి హవా ఉంటుందని చెప్పింది. ఇటు ఏపీ విషయానికి వచ్చేసరికి 25 ఎంపీ సీట్లు ఉంటే..వైసీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.
అంటే దాదాపు స్వీప్ ఇంకా..టిడిపికి ఏమో 0-1 సీటు వస్తుందట. జనసేన జీరో, బిజేపి జీరో అని తేల్చి చెప్పింది. మరి ఈ సర్వే ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది. అసలు గత ఎన్నికల్లోనే 22 మంది ఎంపీలని గెలిపిస్తే వైసీపీ సాధించింది ఏంటి? అసలు వైసీపీలో కొందరు ఎంపీలు అనే సంగతి ప్రజలకు కూడా తెలియదు.
టిడిపికి ముగ్గురు ఎంపీలు ఉన్న వారు..పార్లమెంట్ ఏపీ తరుపున గళం వినిపించేవారు. అలాంటప్పుడు ప్రజలు పోరాడేవారి వైపు ఉంటారు తప్ప..అసలు ఎంపీ అనేవారు ఎవరో కూడా తెలియనివారికి మద్ధతు ఇవ్వడం కష్టం. కాబట్టి టైమ్స్ నౌ సర్వేలో రియాలిటీ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.