కృష్ణా జిల్లా తమ్ముళ్ళు నిరాశలో ఉన్నారు..ఇప్పటివరకు అన్నీ జిల్లాల్లో లోకేష్ కనీసం 10 రోజులపైనే పాదయాత్ర చేశారు. కొన్ని జిల్లాల్లో అన్నీ నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర చేశారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొచ్చేసరికి కేవలం 3 రోజులు మాత్రమే పాదయాత్ర చేయనున్నారు. దీంతో కృష్ణా తమ్ముళ్ళు నిరాశలో ఉన్నారు. వాస్తవానికి మొదట అనుకున్న షెడ్యూల్ లో గుంటూరు జిల్లాలో పాదయాత్ర జరిగేప్పుడు పక్కనే ఉన్న అవనిగడ్డ కవర్ చేసుకుని తర్వాత యథావిధిగా మంగళగిరిలో పాదయాత్ర చేసి..విజయవాడలోని మూడు సీట్లు, పెనమలూరు, పామర్రు, గుడివాడ, నూజివీడు కవర్ చేసుకుని…ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంది.
కానీ ఇప్పుడు రూట్ మ్యాప్ మారింది. ఈ నెల 19న విజయవాడ వెస్ట్, సెంట్రల్ కవర్ చేసుకుని, 20న విజయవాడ ఈస్ట్, పెనమలూరు చేసుకుని, 21న గన్నవరంలో ఎంట్రీ ఇస్తారు. ఇలా మూడు రోజుల్లోనే ఫినిష్ చేస్తారు. అయితే గుడివాడలో పాదయాత్ర ఉంటుందని అక్కడ తమ్ముళ్ళు భావించారు. ఇప్పుడు రూట్ మ్యాప్ లో గుడివాడ లేదు.
అయితే గుడివాడ తెలుగు తమ్ముళ్ళనే కాదు..జిల్లాలో మిగతా వారిని కూడా నిరాశ పర్చకుండా గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు టిడిపి సిద్ధమైంది. టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకుని లోకేష్ పాదయాత్ర గన్నవరంలో ఉంటుంది. భారీ సభ కూడా జరగనుంది. ఈ లక్ష మందితో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు.
ఇక లోకేష్ పాదయాత్ర గన్నవరంలో ఎంట్రీ ఇవ్వగానే వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి వస్తారని, లోకేష్ తో పాటు కలిసి నడుస్తారని టాక్. అన్నీ అనుకున్నట్లు కుదిరితే యార్లగడ్డని గన్నవరం టిడిపి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వంశీ టార్గెట్ గానే లోకేష్ పాదయాత్ర సాగనుంది.