“ఆయన ఊరికేనే రాజీనామా చేయలేదు. వైసీపీ తరఫున పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని భావించారు. అందుకే రాజీనామా చేశారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందే రాజీనామా చేయడం ద్వారా.. తన పై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు“ అని మంగళగిరి నియోజకవర్గం ప్రజల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. తాజాగా ఆళ్ల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో ఆళ్ల రాజకీయాలపై చర్చ సాగుతోంది. ఆయనే చెప్పినట్టుగా 1995 నుంచి ఆయన రాజకీయా ల్లో ఉన్నారు. మరి ఇన్నాళ్లుగా రాజకీయాలు చేసిన నాయకుడు ఇప్పుడు అనూహ్యంగా తప్పుకోవడం.. చేతులు ముడుచుకుని కూర్చోవడం సాధ్యమేనా? అంటే కాదు. పైగా.. పార్టీ కూడా బీసీలకే టికెట్ అని ప్రకటించిన దరిమిలా.. తన దారి తాను చూసుకోవడంలో తప్పులేదని ఆయన బావించినట్టు స్థానికంగా చర్చసాగుతోంది.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆళ్ల ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. అయితే.. అప్ప టి కప్పుడు తనకు టికెట్ లేదని తెలిసిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసినా.. ప్రజల్లో సానుభూతి రావడం కష్టమని భావించే.. ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా సానుభూతిని గెయిన్ చేయాలనేది ఆళ్ల వ్యూహంగా చెబుతున్నారు. తద్వారా.. తాను మంచి నాయకుడిననే భావనను ఆయన ప్రజలకు కలిగించను న్నారు.
అదే సమయంలో నియోజకవర్గం అభివృద్ధిచేయకపోవడంలోనూ తన తప్పులేదని ఆళ్ల పరోక్షంగా ప్రజలకు చెప్పినట్టు అయింది. మొత్తంగా.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉందని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం. మరి దీనిలో నిజమెంతో తెలియకపోయినా.. పరిస్థితులను బట్టి.. వాస్తవమనే వాదన వినిపిస్తోంది.
ఆయన ఇప్పటికీ రూ.10కే సంచినిండా కూరగాయలు ఇస్తున్నారు. రూ.2కే కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఈ పరిణామాలతోనే ఆయన స్వతంత్రంగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.