ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే సామాన్యుల సైతం భయపడుతున్నారు. అధికార పార్టీ నేతలు చూపిస్తున్న అత్యుత్సాహానికి, వారిని కాదన్న వారినీ పెడుతున్న ఇబ్బందులను చూసి సామాన్యుల సైతం అసహ్యించుకుంటున్నారు. ఇంకా టిడిపి నేతలు అయితే చెప్పక్కర్లేదు, కానీ సొంత పార్టీ నేతలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒప్పుకోవడం లేదనీ రాజకీయ వర్గాలు అంటున్నాయి.
గత టిడిపి హయాంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి, కావాలని బాబుని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారని అర్ధమవుతుంది. అందుకే ఈ అరెస్ట్ ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు తప్పని వైసీపీ నేతలు అంటున్నారని సర్వేలు చెబుతున్నాయి . ఎన్నికల ముందు టిడిపి ఎన్నికల ప్రణాళికలు దెబ్బ కొట్టడానికి మాత్రమే జగన్, చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయించారు అనేది, తప్పక పోయినా ఒప్పుకోవాల్సిన వాస్తవం అంటున్నారు వైసిపి నేతలు.
విలువలు లేని పార్టీలో మేము ఉండలేమంటూ కొందరు నేతలు పార్టీ మారారు. ఇంకొందరు మారడానికి సిద్ధమయ్యారు. మారిన వారు చిన్నచిన్న పదవులలో ఉన్న నేతలే కావచ్చు, వారి వలన వైసీపీకి స్థానికంగా చాలా నష్టం జరుగుతుంది అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. నిజంగా స్కిల్ డెవలప్మెంట్ లో స్కాం జరిగి ఉంటే 2021 లోనే చంద్రబాబునాయుడు అరెస్టు చేసి విచారించవలసిన ఉంటుంది. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు అరెస్టు చేయడం అంటే ఇది కక్ష సాధింపు చర్యమే అని సామాన్యుల సైతం అంటున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీకి, వైసిపి అధినేతకి ఒరిగిందేంటో తెలియదు గానీ, చంద్రబాబు నాయుడుకు ప్రజలలో అపారమైన సానుభూతి వచ్చింది. టిడిపికి ఓట్లు పెరిగాయి. సొంత పార్టీ నేతలే వైసిపిని ఛీ కొడుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓటు వైసీపీకి వేస్తాము కానీ చంద్రబాబునాయుడు అని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారు వైసీపీ నేతలు. ఈ సారి ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలా ఓట్ల అభ్యర్థించాలో కూడా తెలియని పరిస్థితిని అధికార పార్టీ నేతలు ఎదుర్కొంటున్నారు.