రాయలసీమ జిల్లాలలో కర్నూలుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలతో వైసిపికి అడ్డాగా మారిపోయింది అని చెప్పవచ్చు. కర్నూలులో మొదటి నుంచి టిడిపి ప్రభావం తక్కువ అని చెప్పవచ్చు. మొదటి నుంచి జరిగిన ఎన్నికలలో రెండుసార్లు మాత్రమే టిడిపి గెలిచిందని చెప్పవచ్చు. కర్నూలు ఆంధ్ర రాజధానిగా రాజకీయ ఉద్దండులను దేశానికి అందించిన నేల. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా పోటీ చేసిన స్థానం. కోట్ల కుటుంబానికి కర్నూలు కంచుకోటగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగయ్యాక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీలో ఇమడలేక టిడిపిలో చేరారని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటుతో సహా వైసిపి క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి కర్నూలు అడ్డాగా మారిందని చెప్పవచ్చు.కర్నూలు, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, ఆలమూరు ఏడు నియోజకవర్గాలతో ఉన్న కర్నూలు పార్లమెంటు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఎంపీగా పోటీ చేస్తారు ఏ పార్టీ ఏ అభ్యర్థిని పోటీగా నిలబెడితే ఇక్కడ విజయం సాధిస్తారు అనే అంశంపై సర్వత్ర ఆసక్తి వ్యక్తం అవుతోంది.
వైసీపీ ఎంపీ రేసులో గుమ్మనూరు జయరాం, జబ్బల శ్రీనివాసులు, రామయ్య, బుట్ట రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 2019లో గెలిచిన సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ ఈసారి ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గుమ్మనూరు జయరాం ఎంపీగా పోటీ చేయడానికి సుముఖత చూపటం లేదని తెలుస్తోంది. గుమ్మనూరు జయరాంపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఒక ప్రైవేటు సంస్థకు చెందిన 1800 ఎకరాల భూమిని జయరాం అక్రమంగా రాయించుకున్నారని, ఒక మందుల కంపెనీ నుంచి జయరాం కుమారుడు బెంజ్ కార్ ను బహుమతిగా పొందాడని, జయరాం సోదరులు నియోజకవర్గాన్ని పేకాట డేన్ గా మార్చారని విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందువల్ల ఈసారి జయరాం గెలుపు కష్టమని ఐపాక్ సర్వే సూచించడంతో వైసిపి ఎంపీగా జయరాం ను నిలబెట్టాలని లేదా అతని అసెంబ్లీ స్థానాన్ని మార్చాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
జబ్బల శ్రీనివాసులు ఇతను బీసీ హక్కుల కోసం పోరాడుతున్నాడు. బిసి నేత, కురమ సంఘ అధ్యక్షుడు. అంతేకాకుండా ఇతనికి పెద్దిరెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అందుకే శ్రీనివాసులు పేరును వైసిపి దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బుట్టా రేణుక పేరును పరిశీలించినప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నందున ఆమెకు వేరే విధంగా లబ్ధి చేకూర్చాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలు తమకు అనుకూలంగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. బీసీ అభ్యర్థులపై ప్రత్యేక దృష్టిని పెట్టి బిసి ఓట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసిపి భావిస్తుంది.
టిడిపి తరఫున కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ రెడ్డి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కర్నూలులో పార్టీపై ఉన్న వ్యతిరేకత, అభివృద్ధి లేకపోవడంతో సూర్య ప్రకాశ్ రెడ్డి ఈసారి తన గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపించి ఇప్పుడు ఎన్నికలలో గెలవాలని కోట్ల భావిస్తున్నారు.
కర్నూలులో ఈసారి గెలిచేది ఎవరో ???? బీసీ అభ్యర్ధా?? లేక కోట్ల విజయభాస్కర్ రెడ్డా???