రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. జనసేన టిడిపి పొత్తు తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు టిడిపి జనసేన విడివిడిగా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ టిడిపి జనసేన పొత్తు తర్వాత వైసిపి ఓట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోదావరి జిల్లాలలో టిడిపి జనసెన స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో టీడీపీ, జనసేన కు మిశ్రమం స్పందన కనిపిస్తోంది. చీరాల, ఎర్రగొండపాలెం, మార్కాపురం గిద్దలూరు, సర్వేపల్లి, కందుకూరు ఈ స్థానాలు మాత్రమే ఈసారి వైసిపి ఖచ్చితంగా గెలిచే స్థానాలుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పర్చూరు అద్దంకి, దర్శి, కొండపి, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు ఇవన్నీ టిడిపి జనసేన పొత్తులో టిడిపి సొంతం చేసుకునే నియోజకవర్గాలుగా చెప్పవచ్చు. సంతనూతలపాడు, ఒంగోలు, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి ఈ నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు జరుగుతుందని, వాటిలో కూడా టిడిపి జనసేన పొత్తు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2019 ఎన్నికల్లో నెల్లూరు క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చింది, కానీ ఈసారి ఆ అవకాశాలు లేనట్లే. పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకత, వైసిపి నాయకులలో ఉన్న అసంతృప్తి, చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలపై వైసీపీ అరాచకాలు ఇవన్నీ కలిపి ఈసారి వైసిపి గెలిచే స్థానాలను తగ్గిస్తుంది అనడంలో సందేహం లేదు.
ReplyReply allForward |