అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ జాగ్రత్తల్లో భాగంగానే వైసిపి కొన్ని నియోజకవర్గాల ఇంచార్జిలను మార్చారు. పరిచయం ఉన్న నేతను, నియోజకవర్గంలో తెలిసిన వ్యక్తిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వైసీపీ మాత్రం అసలు పరిచయమే లేని వ్యక్తిని, పేరు తప్ప మరేమీ తెలియని నేతను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో అద్దంకి నేతలందరూ అవాక్కయ్యారు.
అద్దంకి గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఒక విధంగా చెప్పాలంటే వైసిపికి ఇంకా ఎక్కువ ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే 2014 ఎన్నికల తరువాత వైసిపి నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలలో 23 మందిలో 2019లో అందరూ ఓటమిపాలైతే గెలిచిన ఏకైక స్థానం అద్దంకి స్థానం. గెలిచిన వ్యక్తి గొట్టిపాటి రవికుమార్. ఈసారి కచ్చితంగా రవికుమార్ కు చెక్ పెట్టాలని వైసిపి 2019 నుంచే పావులు కదుపుతోంది. అందుకోసం కరణం బలరాం కుటుంబం నుంచి ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని వైసిపి భావించినా కరణం కుటుంబం ఒప్పుకోకపోవడం వల్ల అది కుదరలేదు. ఇప్పుడు కొత్తగా పాణెం హనిమిరెడ్డికి టికెట్ ఇచ్చారు. హనిమిరెడ్డి ఎవరో కూడా అద్దంకి నియోజకవర్గ ప్రజలకు తెలియదు. కానీ హనుమి రెడ్డి వై వి సుబ్బారెడ్డి కి అత్యంత సన్నిహితుడైనందువల్ల మాత్రమే ఈ నియోజకవర్గం అతనికి కేటాయించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటివరకు అద్దంకి ఎన్నికలు అంటే గొట్టిపాటి వర్సెస్ కరణం కుటుంబంలా ఉండేది. కానీ ఈసారి కొత్త వ్యక్తి తెరపైకి వచ్చారు. వైసిపి నేతలందరూ గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నా గ్రామాలలోని నేతలు మాత్రం రవికుమార్ వైపే చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసిపి హవాలో కూడా గెలిచిన రవికుమార్ ఈసారి భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా చాటుతాడని టిడిపి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరి గొట్టిపాటి రవికుమార్ కు పాణేం హనుమిరెడ్డి చెక్ పెట్టగలరా?????