ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ గెలుపు కోసం వ్యూహాత్మకంగా పయనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టిడిపి జనసేన పొత్తు ప్రకటించారు. టిడిపి జనసేన కలిసి ఈసారి అధికారంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక విషయంలోనే టిడిపికి జనసేనకి పొసగడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. అటువంటి వాటిలో కొన్ని నియోజకవర్గాల గురించి చూద్దామా.
ముమ్మిడివరం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సుబ్బరాజు ఉన్నారు. జనసేన పార్టీ ఇంచార్జిగా పితాని బాలకృష్ణ ఉన్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వల్ల మాత్రమే సుబ్బరాజు ఓటమి పొందారు. ఈ స్థానంలో పట్టు కోసం రెండు పార్టీల అభ్యర్థులు పట్టబడుతున్నారు. జనసేనకు కనుక ముమ్మడివరం టికెట్ ఇస్తే సుబ్బరాజు వైసిపి లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రామచంద్రాపురం ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెల్లిబోయిన వేణుకు, పిల్లి సుభాష్ వర్గానికి మధ్య వర్గ పొరు ఉన్నాయి. ఈ నియోజకవర్గం వైసీపీకి పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ ఇద్దరు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరి మధ్య వర్గ పోరు వలన టిడిపి జనసేన సమన్వయంతో పనిచేస్తే కూటమికి లభించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రామచంద్రపురం నుంచి టిడిపి అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ ఇంచార్జిగా చిక్కాల దొరబాబు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తపేట నియోజకవర్గం ఇక్కడ వైసిపి ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. టిడిపికి బండారు సత్యానందరావు, జనసేన పార్టీ తరఫున బండారు శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. వీరిరువురు కూడా తమకే ఈసారి టికెట్ ఇవ్వాలని పట్టుతో ఉన్నారు. ఈసారి చీర్ల జగ్గిరెడ్డి గెలిచే అవకాశాలు తక్కువగా ఉండడంతో టిడిపి జనసేన రెండూ కూడా ఈ స్థానంపై కన్నేసాయని చెప్పవచ్చు.
ఈ నియోజకవర్గాలలో జనసేనకు టికెట్ ఇస్తే వైసీపీకే లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…
ReplyReply allForwardAdd reaction |