175 స్థానాలలో గెలిచి తీరాలని వైసిపి క్యాడర్ ను ఆదేశిస్తుంటే, ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం టిడిపి పావులు కదుపుతోంది. అందుకోసం వైసీపీ ఇప్పటినుంచి కసరత్తు ప్రారంభించింది. ఇంచార్జి ల మార్పుతో వైసిపి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలు కీలకంగా మారాయని చెప్పవచ్చు. ఈసారి అన్ని స్థానాలలో టిడిపి గెలిచి తీరాలని పట్టుతో ఉంది.
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు లాభిస్తుందని టిడిపి ధీమా తో ఉంది. అంతే కాకుండా జనసేన టిడిపి కూటమి కూడా తమకు లాభిస్తుందని టిడిపి నేతలు చెబుతున్నారు. కానీ వారి అంచనాలను మారుస్తూ వైసిపి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సెట్టింగ్ ఎమ్మెల్యేగా సుచరిత ఉన్నారు ఈమె కొత్త కాలము హోమ్ మంత్రిగా చేశారు. హోమ్ మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు కూడా వినిపించాయి. కానీ సుచరిత పార్టీ మారలేదు. వైసిపి లోనే ఉంది కానీ సుచరిత పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఈసారి ప్రతిపాడులో సుచరితను తప్పించి బలసాని కిరణ్ కుమార్ కు వైసిపి ఇంచార్జి పదవిని ఇచ్చారు. కిరణ్ కుమార్ కు ఈ నియోజకవర్గంలో పట్టు తక్కువగా ఉంది. కానీ వైసీపీ మాత్రం ప్రయోగాత్మకంగా ఇంచార్జిలో మార్పు చేపట్టింది
మరి ఈ వైసీపీ వ్యతిరేక గాలిలో టిడిపి గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా వేచి చూడాల్సిందే….