వైయస్ కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి రాజకీయ విభేదాలు తప్ప శత్రుత్వం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరూ మంచి మిత్రులని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ, రాజకీయ శతృత్వాన్ని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చేశారు చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేయించి, బెయిల్ రాకుండా జైలులో ఉంచి ఇబ్బందులకు గురి చేశారు.
వైయస్ షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు తో నారా కుటుంబానికి ఒక గిఫ్ట్ ను పంపారు. దానిని లోకేష్ కూడా స్వాగతించారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు తెలంగాణలో బలంగా వినిపించాయి. అక్కడ అది సాధ్యపడకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదనే కారణంతో షర్మిల పోటీ నుంచి తప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ తో మాత్రం మంచి సంబంధాలు కలిగి ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు నారా కుటుంబానికి షర్మిల గిఫ్ట్ పంపడం అంటే పరోక్షంగా షర్మిల చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నట్లే. ఒకవేళ కాంగ్రెస్ తరపున షర్మిలను బరిలో దించినా కూడా టిడిపి కాంగ్రెస్ పని చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ నుండి బరిలో దిగితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో ఉన్న కాంగ్రెస్ వాదులు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ షర్మిల వైపే వస్తారని వైసీపీలో నాయకులంతా ఖాళీ అయిపోతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
షర్మిల టిడిపికి మద్దతుగా నిలిస్తే వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ కానుందా???
ReplyReply allForwardAdd reaction |