పార్టీ మారడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అడిగిన స్థానంలో టికెట్ ఇవ్వకపోయినా, నచ్చిన సీటు ఇవ్వకపోయినా, కోరుకున్న పదవి దక్కకపోయినా పార్టీ మారడం సర్వసాధారణమే. ఇది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా పార్టీ మారాలనుకున్నప్పుడు అది వారికి చాలా చిన్న విషయమే. కానీ ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నది మాత్రం వైసిపి నాయకులకే కాదు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
గెలిచిన ప్రతి నాయకునికి ఏదో ఒక పదవిని ఇస్తూ వెళ్లారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పదవి పొందిన ప్రతి ఒక్కరు తనకు అండగా ఉంటారని భావించారు జగన్. కానీ అది పొరపాటని పదవి పొందిన నేతలందరూ నిరూపిస్తున్నారు. విశాఖ నుండి ఎమ్మెల్సీ ఇచ్చినా వంశీకృష్ణ పార్టీకి రాజీనామా చేయడం బాధాకరమని విశాఖ వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. ,ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పొందిన మరో నేతకి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి అందలం ఎక్కిస్తే ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి మరోవైపు మరో పార్టీ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ నాయకులే కాదు చాలామంది నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పార్టీ మారే ఆలోచనలో ఉన్న నేతలందరూ పార్టీ నుంచి ఏదో ఒక పదవిని పొందిన వారే కావడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. మరి ఇటువంటి పరిస్థితులలో వైసిపి ఏం చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు……