రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏ అభ్యర్థులు గెలుస్తారో ఏ స్థానాల్లో విజయం సాధించవచ్చు అని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆ సర్వేలలో అధికార వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. కానీ వై నాట్ 175 అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకటో రెండు సీట్లు ఓడిపోతే పర్వాలేదు కానీ జగన్ చుట్టూ ఒక రక్షణ కవచం లా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులందరికీ ఈసారి ఓటమిపాలవబోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అదే నిజమైతే జగన్ కు రక్షణగా నిలిచిన ఎమ్మెల్యేలకే దిక్కు లేదంటే, మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటో అని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యుల సైతం అంటున్నారు. ఓడిపోతారు అని ఖచ్చితంగా సర్వేలు చెబుతున్న వారిలో ఆముదాల వలస నుండి తమ్మినేని సీతారాం, ఉత్తంశెట్టి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబురావు, పినిపె విశ్వరూప్, జక్కంపూడి రాజా, గ్రంధి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగా నాదరాజు, కొట్టు సత్యనారాయణ, ఆళ్ల నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, పేర్ని నాని, బెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, మేరుగు నాగార్జున, మేకతోటి సుచరిత, విడుదల రజిని అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, పెద్దారెడ్డి, ఉషశ్రీ చరణ్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు ఇలా మంత్రులు, మాజీ మంత్రులే ఓటమిపాలయ్యే వారిలో ఎక్కువగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. వీరిలో కొందరికి స్థానచలనం చేసి, మరికొందరికి వేరే పదవులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ సారి పార్టీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏమవుతుందో