అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పరిస్థితి.అంగ బలం, అర్థ బలం అన్నీ ఉన్నా గెలుపు మాత్రం సునీల్ కు దక్కడం లేదు.అన్ని పార్టీల నుంచి పోటీ చేశారు కానీ గెలుపు మాత్రం గుమ్మం దాటి రాలేదు.మరి ఈసారైనా గెలుస్తాడా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చలమల శెట్టి సునీల్ ఇతను కాకినాడ ప్రజలకు సుపరిచితుడే.అన్ని పార్టీలకు పరిచయమైన పేరే. అందరి పార్టీ నేతలతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.కానీ సునీల్ పోటీ చేసిన ప్రతిసారి ఓటమినే చూస్తున్నారు.
2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన సునీల్ ఓటమి చవిచూశారు.2014 లో వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పొందారు.తర్వాత పార్టీ మారి 2019లో టిడిపి తరఫున పోటీ చేసి వంగా గీతా విశ్వనాధ్ చేతిలో ఓటమి పొందారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సునీల్ ఓడిన ప్రతిసారి తక్కువ మెజారిటీతో ఓడిపోవడం.మరి ఇప్పుడు పార్టీ మారి వైసీపీలో కి చేరారు అది కూడా కాకినాడ ఎంపీ స్థానం తనకి ఇస్తానంటేనే అని జగన్ దగ్గర మాట తీసుకొని మరి పార్టీ మారారు.మరి ఇప్పుడు సునీల్ అంచనాలు తారుమారయ్యాయి.టిడిపి జనసేన పోత్తుంటే ఖచ్చితంగా పొత్తులో అభ్యర్థి గెలిచే స్థానాలలో కాకినాడ ఒకటి.అటువంటి కాకినాడలో వైసిపి తరఫున ఇప్పుడు సునీల్ పోటీ చేస్తే గెలవడం కష్టమేనని రాజకీయ వర్గాలు అంటున్నారు.సునీల్ అన్ని పార్టీలలోనూ ఉండి పార్టీ మారడంతో పార్టీ నేతలు అందరిలో సునీల్ పై వ్యతిరేకత ఉంది.టిడిపి నుంచి వైసీపీకి వచ్చారని టిడిపి వారిలో,జనసేన లో చేరతానని మాట ఇచ్చి జనసేన లో కాకుండా టిడిపిలో చేరారని జనసేన నాయకులకు,అటూ ఇటూ పార్టీ మారుతున్నారు అని వైసిపి నాయకులకు సునీల్ అంటే విముఖత ఉంది.మరి ఇలాంటి పరిస్థితులలో సునీల్ నియోజకవర్గస్థాయిలో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే కచ్చితంగా కాకినాడ ఎంపీ స్థానాన్ని గెలవాల్సిందే.మరి ఇప్పుడున్న పరిస్థితులలో సునీల్ గెలుపు కష్టమే అని సామాన్యునికి సైతం అర్థమవుతుంది.మరి ఎన్నికల నాటికి ఏ అద్భుతం జరుగుతోందో వేచి చూడాల్సిందే…..