సంక్షేమ పథకాలే అమలు లక్ష్యంగా రాష్ట్రంలో వైసిపి మరోసారి అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తున్నారు.కానీ ఇచ్చిన హామీల విషయంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని అందరూ విమర్శిస్తున్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోవడం,సిపిఎస్ రద్దు చేయకపోవడం,నిరుద్యోగ సమస్యలు ఇలా అధికారంలోకి రావడానికి వైసీపీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిర్వర్తించలేదు.ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ పథకాలే కాకుండా, కొత్త కొత్త సంక్షేమ పథకాలతో నగదు బదిలీ చేయడం తప్ప మరే ఉపయోగం లేదని,పథకాలు లబ్ధి పొందుతున్న వారే విమర్శిస్తున్నారు.అంతే కాకుండా మౌలిక వస్తువుల కల్పనలో వెనకబడి ఉండడంతో ప్రజలందరూ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు.
2019 గెలిచిన ఎమ్మెల్యేలలో ఇప్పుడు 40 శాతం మందికి పైగా ఎమ్మెల్యేలపై ప్రజలలో వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. వారిలో వైసీపీకి ముఖ్యమైన నాయకులు ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.రెడ్డి శాంతి,తమ్మినేని సీతారాం,గొర్లె కిరణ్,కంబాల జోగులు,ఉత్తమశెట్టి, అన్నం రెడ్డి,పినిపే విశ్వరూప్,తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు,బెల్లంపల్లి శ్రీనివాస్ రావు,ఆళ్ల నాని,విడుదల రజిని,అంబటి రాంబాబు,రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,,శ్రీనివాసులు,చింత రామచంద్రారెడ్డి,ఎన్ వెంకట గౌడ ఇలా దాదాపు నలభై ఐదు మంది ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది.వీరిలో కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తో పాటు ప్రభుత్వం పై వ్యతిరేకత కూడా ఉందని తెలుస్తుంది.కానీ కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేకున్నా,పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల వీరు కూడా నష్టపోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇటువంటి పరిస్థితులలో ఈసారి ఎన్నికల్లో జగన్ అనుకున్నా లక్ష్యాన్ని చేరుకోగలరా …..!!??