ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈసారి గెలిచి తీరాలని ఇరు పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. సామాజిక న్యాయం అంటూ వైసీపీ కొత్త అధ్యయనానికి తెరతీసిందని చెప్పవచ్చు.
ఏలూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఇప్పటివరకు కమ్మ, కాపు సామాజిక వర్గాల వారే పోటీలో ఉన్నారు. కానీ ఈసారి ఇరు పార్టీలు యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో ఏలూరు పార్లమెంటు స్థానం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వైసీపీ తరఫున కారుమూరి సునీల్ ను ప్రకటించగా, సునీల్ కు పోటీ ఇవ్వడానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన గోపాల్ యాదవ్ ను టిడిపి బరిలో దించింది.
వైసిపి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా టిడిపికి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉంగుటూరు, ఏలూరు, కైకలూరు ఈ నియోజకవర్గాలన్నీ టిడిపికే అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. పోలవరం, చింతలపూడి, నూజివీడు, దెందులూరు, వీటిలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని గెలిచే అవకాశాలు ఇరు పార్టీలకు సమానంగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా చూసుకున్న టిడిపికే ఎక్కువ బలం ఉండడంతో, పార్లమెంట్ అభ్యర్థి గోపాల్ యాదవ్ కే గెలిచే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏలూరు నియోజకవర్గంలో టిడిపికే బలం ఎక్కువ. సామాజికంగా కూడా ఓటర్లు గోపాల్ యాదవ్ వైపే చూస్తున్నారు. అధికార పార్టీపై విసిగి వేసారిన నియోజకవర్గ ప్రజలందరూ ఈసారి టిడిపి జనసేన కూటమి వైపే చూస్తున్నారన్నది వాస్తవం.
ఇటువంటి పరిస్థితులలో ఏరి కోరి మరి యాదవులకు సీటు ఇచ్చిన వైసిపి విజయాన్ని అందుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే???