ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు గెలిచే అభ్యర్థులను బరిలోదించి విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకారావుపేట, నర్సీపట్నం. ఈ నియోజకవర్గాలలో ఒక మాడుగుల తప్ప మిగిలిన అన్నిచోట్ల టిడిపి గెలిచి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చోడవరం టిడిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున కరణం ధర్మశ్రీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి టిడిపి తరఫున అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా కచ్చితంగా టిడిపి అభ్యర్థి విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాడుగుల ఈ నియోజకవర్గంలో వైసిపి కచ్చితంగా గెలిచే అవకాశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపిలోని వర్గ పోరు ఈసారి వైసీపీకి కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. అనకాపల్లి టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, తక్కువ మెజారిటీతో అయినా వైసీపీ నే గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెందుర్తి నుంచి టిడిపి జనసేన కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యలమంచిలి నుంచి టిడిపి అభ్యర్థి గెలిచే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన పాయకారావుపేట నుంచి టిడిపి తరఫున వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గడ్డం బుజ్జి మద్దతు అనితకు ఉన్నట్లయితే భారీ మెజారిటీతో విజయం సాధించే నియోజకవర్గాలలో ఇది కూడా ఒకటి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు బరిలో ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో గెలిచేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయ్యన్నపాత్రుడికి పోటీగా సన్యాసి పాత్రుడను నిలబెట్టే ఆలోచనలో వైసిపి ఉంది.