నవరత్నాలు మేనిఫెస్టో తో జగన్ 2019 లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలంతా జగన్ ఇచ్చిన హామీలను,ఒక్క ఛాన్స్ అనే జగన్ మాటను నమ్మి జగన్ ను గెలిపించారు.గెలిచిన దగ్గర నుండి నవరత్నాల అమలు కాకుండా,తమ నేతలు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతున్నారు.
నవరత్నాలలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదని ప్రజలందరూ విమర్శిస్తున్నారు. నవరత్నాలలో ముఖ్యమైనది మద్యపాన నిషేధం.మద్యపాన నిషేధం చేస్తానని అక్కాచెల్లెళ్ల కళ్ళలో ఆనందం చూస్తానని చెప్పి,పదవిలోకి వచ్చిన తర్వాత మద్యం లేకపోతే ఆదాయం లేదని,కొత్త కొత్త బ్రాండ్లు ఎక్కువ రేట్లకు అమ్మకాలు జరిపుతున్నారు.ఆనందం మాట దేవుడు ఎరుగు ఏడుపు ఆగకుండా వచ్చేలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
కల్తీ మద్యంతో తమ ఇంటి వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. మీరిచ్చే “మధ్యము మాకొద్దు మీరు వద్దు ఈసారి ఈసారి మీరు వద్దు “అంటూ మహిళల వినూత్నమైన నిరసనలు తెలుపుతున్నారు. ఆ మధ్య చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిడదవోలులో చేపట్టిన కార్యక్రమంలో మద్యం వలన బాధపడిన కొంతమంది మహిళలు సీఎం చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. ఇదే తరహా నిరసనలు పలుచోట్ల మహిళలు చేస్తున్నారు. ఎంత బాధ పడితే అటువంటి పని చేశారు అని రాజకీయ వర్గాలు అంటున్నారు.ఇప్పటికైనా మద్యం లేకుండా చేసి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని అందరూ ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు.