ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఇంచా మార్పుతో వైసిపి ఎన్నికల్లో విజయం కోసం సన్నద్ధమవుతోంది. టిడిపి వైసిపి ఇరు పార్టీలు ఈసారి కచ్చితంగా గెలవాలని తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వైసీపీ అధినేత నియోజకవర్గ ఇంచార్జిల మార్పుతో సాహసమే చేశారని చెప్పవచ్చు.
ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన తిరువూరులో గత ఎన్నికల్లో కొక్కిలిగడ్డ రక్షణనిధి విజయం సాధించారు. కానీ ఈసారి ఇంచార్జిగా నల్లగట్ల స్వామి దాస్ ను వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని రక్షణ నిధి అంగీకరించలేకపోతున్నారు.
తిరువూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీ పైన తీవ్ర వ్యతిరేకత లేకున్నా, ఎమ్మెల్యే రక్షణ నిధిపై తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పవచ్చు. సొంత పార్టీ నేతలే ఈసారి రక్షణ నిధి తమకు వద్దు అని ప్రచారం చేస్తున్నారు అంటే రక్షణ నిధి పై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వర్గం రక్షణ నిధిని వద్దంటే మరో వర్గం రక్షణ నిధి వైపే ఉండి వైసిపి అధినేతను సందిగ్ధంలో పడవేస్తోంది.
తిరువూరులో వైసిపి ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. అందుకే తమ పార్టీ తరపున ఎవరిని నిలబెట్టిన గెలుస్తారు అనే ధీమాతో నల్లగట్ల స్వామి దాస్ కు టికెట్ ఇచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ రక్షణ నిధి వర్గం సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే???
మరి ఇటువంటి తరుణంలో తిరువూరులో మరోసారి వైసీపీ జెండా ఎగిరేనా???