టిడిపి జనసేన పొత్తు తర్వాత రాజకీయాల్లో ఏ టికెట్ జనసేనకి ఇస్తే గెలుస్తుంది, టిడిపికి లాభిస్తుంది అనే అంశాలన్నీ చర్చిని అంశమయ్యాయి.ఉభయగోదావరి జిల్లాలు టిడిపికి కంచుకోట.అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండటం వల్ల,ఉభయ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు టిడిపి వే అని టిడిపి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ రూరల్,పిఠాపురం,కాకినాడ సిటీ ఈ మూడు స్థానాలలో జనసేన పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి.తుని,కాకినాడ,ప్రత్తిపాడు జగ్గంపేట ఈ నియోజకవర్గాలలో టిడిపి తో పొత్తు ఉంటే మాత్రమే జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు పోటీ చేసిన స్థానాలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బట్టి,ఇప్పుడు జనసేన ఆస్థానంలో టికెట్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.కాకినాడ రూరల్,సిటీలో కూడా జనసేనకు పట్టుంది.ఈ రెండు నియోజకవర్గాలలో టిడిపి జనసేన పొత్తులో అయినా జనసేన పోటీ చేసినా ఖచ్చితముగా విజయం సాధించే నియోజకవర్గాలు ఇవి. వీటితోపాటు పిఠాపురం కూడా జనసేనకు మంచి పట్టున్న నియోజకవర్గం.ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. టీ టైం అధినేత అధినేతను పిఠాపురంలో ఉంచటం వల్ల పవన్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు తెలుస్తోంది.తుని,జగ్గంపేట, ప్రత్తిపాడు,పెద్దాపురం ఇవన్నీ కూడా టిడిపి తో పొత్తు ఉంటే మాత్రమే జనసేన గెలిచే స్థానాలు.
ఏది ఏమైనా టిడిపి జనసేన కూటమి ఈసారి టిడిపికి విజయాన్ని అందిస్తుందా????? లేదా వేచి చూడాల్సిందే……