రాంగోపాల్ వర్మ పరిచయమే అక్కరలేని దర్శకుడు.ఎప్పుడు ఏదో ఒక అంశం గురించి వివాదాలతో సహవాసం చేస్తుంటాడు.ఆర్జీవి ఏ సినిమా తీసిన అది ఏదో ఒక వివాదం లేకుండా ప్రజల ముందుకు వెళ్ళదు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఆర్జీవి ‘వ్యూహం’ అంటూ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా నవంబర్ లో ప్రజల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో జగన్ హీరోగా,చంద్రబాబు నాయుడును విలన్ గా చూపిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కోణాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్న అని చెబుతున్నాడు.వాస్తవిక కథతో ఈ సినిమా రూపొందిస్తున్న అని ఆర్జీవీ చెబుతున్నా, ఇది పూర్తిగా రాజకీయమే అని అందరికీ తెలిసిన విషయమే.
ఈ సినిమాలో జగన్ కోసం ప్రత్యేకంగా డైలాగులు రూపొందించారని,చంద్రబాబును విలన్ గా చూపించారని టీజర్ ను చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది.ఈ సినిమాలో క్విడ్ ప్రో కో జరిగిందని కొందరి వాదన. నచ్చిన వ్యక్తి గురించి సినిమా తీస్తే అది క్విడ్ ప్రో కో ఎలా అవుతుందని కొందరు వాదిస్తుంటే,ఈ సినీ నిర్మాత అయిన దాసరి అరుణ్ కుమార్ కు టీటీడీ డైరెక్టర్ పదవిని ఇచ్చారని ఈ సినిమా నిర్మించటం వల్లే అతనికి ఆ పదవి ఇచ్చారని టిడిపి వారు అంటున్నారు.
మరి ఈ సినిమా నిర్మాణంలోకి రాకముందే దాసరి అరుణ్ కుమార్ కు టీటీడీ డైరెక్టర్ పదవి ఇచ్చారా లేదా పదవి ఇచ్చిన అభిమానంతో ఈ సినిమా తీశాడా!!!!!!
ReplyReply allForward |