రాష్ట్రంలో కొందరు మంత్రుల పరిస్థితిని గమనిస్తే.. పాపం అనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎందుకం టే.. వారికి ఇంటా బయటా కూడా సెగ తగులుతోంది. సొంత పార్టీ నేతల నుంచే విభేదాలు కొనసాగుతు న్నాయి. దీనికి తోడు సదరు మంత్రికి టికెట్ ఇస్తే.. పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా.. క్షేత్రస్థాయిలో నాయకులు తేల్చి చెబుతుండడం మరింత హెచ్చరికగా ఉంది. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి తానేటి వనితకు తీవ్ర సెగ తగిలింది.
దళిత యువకుడి ఆత్మహత్య కేసులో ఆమె నిరసన ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు గంటన్నర సేపు రోడ్డుపైనే ఆమెను నిలబెట్టారు. అయితే..ఇ క్కడ చిత్రం ఏంటంటే.. ఇలా నిరసన వ్యక్తం చేసిన వా రు.. ప్రతిపక్ష నాయకులు కాదు. వైసీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ నాయకులే కావడం గమనార్హం. దీనికి కారణం.. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో రగులుతున్న సెగలు.. పొగలేనని అంటున్నారు పరిశీలకు లు. గతంలోను ఇప్పుడు కూడా..కొవ్వూరు నియోజకవర్గంలో ఓ వర్గం హవా నడుస్తోంది.
అయితే.. అదే వర్గాన్ని వనిత దూరం చేసుకున్నారు. మరోవైపు.. ఆమె భర్త కూడా ఇదే వర్గాన్ని దూషించ డంతోపాటు.. వారికి పనులు చేయకుండా అడ్డుకున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో వనితకు వ్యతిరే కంగా తరచుగా ఇక్కడ ధర్నాలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొ న్న సమయంలోనూ ఆమె వస్తున్న సమయంలో గ్రామంలో లైట్ల ఆర్పేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది.
అంతేకాదు.. తోడుగా పోలీసులను పెట్టుకుని వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మరింతగా సెగ పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. దీంతో వనితకు టికెట్ ఇచ్చినా ఓడిపో వడం ఖాయమనే వాదన సొంత నేతల మధ్యే వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా.. మంత్రి మాత్రం పర్యటనలు చేస్తున్నారు. కానీ, సొంత నేతలతోనే సెగ పెరుగుతుండడం గమనార్హం. మరి చివరకు ఏంజరుగుతుందో చూడాలి.