ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పార్టీలన్నీ సర్వేలు నిర్వహించి ఎవరిని ఎక్కడ నిలబెడితే విషయం సాధిస్తామో అంచనాలు వేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం టిడిపికి కంచుకోట లాంటిది. ఇక్కడ రెండు లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నంబూరి శంకర్రావు ఉన్నారు. ఈ నియోజకవర్గ ఇసుక రీచ లకు పెట్టింది పేరు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ నియోజకవర్గం నుంచి వ్యాపారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి ఎమ్మెల్యే మాత్రం మరో అడుగు ముందుకు వేసి సొంత పార్టీ నేతలపైనే పీడీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి నుండి గతంలో కొమ్మలపాటి శ్రీధర్ పోటీ చేశారు. కానీ ఈసారి కొమ్మలపాటి శ్రీధర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకనే పార్టీ ఈ అభ్యర్థి మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో జనసేనకు ఓటు బ్యాంకు ఉన్నా వారిని తమ వైపు మలుచుకునే అధినాయకత్వం కరువైందని తెలుస్తోంది. ఈసారి పెదకూరపాడులో టిడిపి జెండా ఎగరవేయాలని అభ్యర్థుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి టిడిపి అన్వేషణ ఫలించి భాష్యం ప్రవీణ్ కు ఈ నియోజకవర్గ టికెట్ ను కేటాయించారు.
మరి ఈసారి పెదకూరపాడు లో ఏ పార్టీ జెండా ఎగరనుందో?????